Begin typing your search above and press return to search.

'దూకుడు 2' మరియు 'చిరంజీవి-మహేష్' మల్టీస్టారర్ పై శ్రీను వైట్ల క్లారిటీ..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 7:30 AM GMT
దూకుడు 2 మరియు చిరంజీవి-మహేష్ మల్టీస్టారర్ పై శ్రీను వైట్ల క్లారిటీ..!
X
టాలీవుడ్ లో హీరోయిజానికి యాక్షన్‌ అంశాలకి తనదైన శైలి కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించగలిగిన ఇప్పటి దర్శకులలో శ్రీను వైట్ల ముందు వరుసలో ఉంటారు. 'ఆనందం' సినిమాతో తొలి విజయం అందుకున్న శ్రీను వైట్ల.. 'సొంతం' 'వెంకీ' 'ఢీ' 'కింగ్' 'దుబాయ్ శీను' 'రెడీ' 'నమో వెంకటేశాయ' 'దూకుడు' 'బాద్ షా' వంటి వరుస విజయాల్ని అందుకొని స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరాడు. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ వంటి సీనియర్ హీరోల దగ్గర నుంచి.. మహేష్ బాబు - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల వరకు అందరితో వర్క్ చేసాడు.

ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా వచ్చిందంటే కచ్చితంగా హిట్టే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యే స్థాయికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 'ఆగడు' 'బ్రూస్ లీ' 'మిస్టర్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి వరుస పరాజయాలతో దర్శకుడు సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన వైట్ల శ్రీను.. మంచు విష్ణుతో ‘డి అండ్‌ డి’ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇదే క్రమంలో 'దూకుడు 2' మరియు చిరంజీవి - మహేష్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీను వైట్ల వీటిపై క్లారిటీ ఇచ్చారు.

'దూకుడు 2' చేయాలనే ఐడియా ఏమీ లేదని.. కొన్ని సినిమాలను అలా వదిలేసి కొత్తవి ట్రై చేస్తేనే మంచిదని శ్రీను వైట్ల చెప్పారు. చిరంజీవి - మహేష్ లతో ఓ మల్టీస్టారర్ చేస్తున్నానేవి రూమర్స్ అని ఆయన తెలిపారు. 'డబుల్స్' అనే ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నానని.. కానీ అందులో హీరోలు చిరు - మహేష్ కాదని.. 'డి అండ్‌ డి' కొనసాగింపుగా ఉంటుందని వైట్ల శ్రీను అన్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు చేయబోతున్నానని.. మూడూ హిలేరియస్ ఎంటర్టైనర్స్ అని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 'డి & డి' సినిమా ‘ఢీ’కి సీక్వెల్ కాదని.. కానీ ఎక్కడో ఆ సినిమాతో ఓ చిన్న కనెక్షన్‌ మాత్రం ఉంటుందని శ్రీను వైట్ల తెలిపారు.