Begin typing your search above and press return to search.

తనపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన శ్రద్ధా

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 PM GMT
తనపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన శ్రద్ధా
X
తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించే నటీమణుల్లో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. 'జెర్సీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది శ్రద్ధ. ఇందులో ప్రియురాలిగా - భార్యగా మెచ్యూరిటి కలిగిన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ‘జోడి’ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో విక్రమ్ వేద - అజిత్ తో కలసి నెర్కొంద పార్వయి - యూ టర్న్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పలు తెలుగు - తమిళ - కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో డౌట్ వచ్చిన వాళ్ళందరిని ఐసోలేషన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ ప్రయాణించిన ఫ్లైట్ లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రయాణం చేసినట్లు - అందువల్ల కర్ణాటక వైద్య అధికారులు ఈమెను ఐసోలేషన్ తరలించినట్లు ఒక తమిళ వెబ్ సైట్ తెలిపింది. ఈ విషయంపై శ్రద్ధా అభిమానులు కంగారు పడ్డారు.

అయితే దీనిపై స్పందించిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ విషయాన్ని ఖండించింది. వాస్తవానికి నేను హైదరాబాద్ - చెన్నైకి విమాన ప్రయాణం చేశానని - కానీ ప్రయాణికులలో ఎవరికి కరోనా లేదని చెప్పుకొచ్చింది. కర్ణాటక పోలీసులు కానీ, వైద్య అధికారులు కానీ తన ఇంటికి రాలేదని..నా డాక్టర్ ఫ్రెండ్ సూచన మేరకు 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పింది. అంతేకాకుండా మార్చి 29కి 14 రోజులు పూర్తయ్యాయని, ప్రస్తుతం తన తల్లికి వంట గదిలో హెల్ప్ చేస్తున్నానంటూ తెలియజేసింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఆపాలని, ఈ సమయంలో పుకార్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయం తెలియగానే తన అభిమానులు రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తోపాటు తమిళ్ లో రెండు సినిమాలు, కన్నడలో మరో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.