Begin typing your search above and press return to search.

యశ్ రాజ్ బ్యానర్ కి బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న స్పై థ్రిల్లర్స్

By:  Tupaki Desk   |   29 Jan 2023 10:00 AM GMT
యశ్ రాజ్ బ్యానర్ కి బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న స్పై థ్రిల్లర్స్
X
బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగ యశ్ రాజ్ ఫిలిమ్స్ కి మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రొడక్షన్ హౌస్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1973లో యశ్ రాజ్ చోప్రా తన దర్శకత్వంలోనే తానే నిర్మాతగా మొదటి సినిమా చేశాడు. అప్పటి నుంచి యశ్ రాజ్ చోప్రా దర్శకత్వంలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ లో మెజారిటీ సినిమాలు తెరకెక్కాయి. 2012లో యశ్ చోప్రా చివరి సినిమా చేశాడు. అదే ఏడాది అతను మరణించాడు. ఇక తండ్రి మరణం కంటే ముందుగానే ఈ ప్రొడక్షన్ బాధ్యతలని యశ్ చోప్రా తనయుడు ఆదిత్యా చోప్రా తీసుకున్నారు.

అప్పటి నుంచి తన టేస్ట్ కి తగ్గట్లుగా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే యశ్ రాజ్ ఫిలిమ్స్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే సినిమాలు స్పై థ్రిల్లర్ కథలు అని చెప్పాలి. బాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి రీచ్ అయిన ధూమ్ సిరీస్ కాన్సెప్ట్ కూడా దొంగ, పోలీస్ గేమ్ తరహాలోనే ఉంటుంది. అలాంటి కథలతోనే ఈ బ్యానర్ ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.

2012లో ఏక్ ద టైగర్ సినిమాతో స్పై థ్రిల్లర్ కథలకి పెద్దపీటవేస్తూ వచ్చారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత టైగర్ జిందా హై అనే సినిమాతో 2017లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తరువాత 2019లో వార్ మూవీ కూడా వీరి ఖాతాలో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు షారుఖ్ పఠాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాన్ని అందించారు. ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా 300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని బాషలలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక దీని తర్వాత సల్మాన్ ఖాన్ తో టైగర్ 3 మూవీ చేస్తున్నారు. ఇది కూడా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుంది.ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.