Begin typing your search above and press return to search.
చివరికి సౌత్ స్టోరీనే బాలీవుడ్ ని ఆదుకుంది!
By: Tupaki Desk | 21 May 2022 4:04 AM GMTచూసే కళ్లను బట్టి ఆలోచించే మెదడును బట్టి ప్రతిదీ మారుతుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ మాత్రమే ఇండియాలో నంబర్ 1 అనుకునే పరిస్థితి ఉంది. నిజానికి బాలీవుడ్ దేశంలోనే అత్యంత ఖరీదైన పరిశ్రమగా అగ్రపథంలో కొనసాగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు బాలీవుడ్ కి ధీటైన పరిశ్రమ టాలీవుడ్ అన్న చర్చ నిజంగా గర్వించదగిన విషయం.
ఇప్పుడు చూసే కళ్లు మారాయి.. ఆలోచించే మెదళ్లు మారాయి. బాలీవుడ్ ని కొట్టే ఇండస్ట్రీగా టాలీవుడ్ నిరూపించుకోవడమే దీనికి కారణం. ఖాన్ ల త్రయానికి సైతం చెమటలు పట్టించే రేంజు టాలీవుడ్ హీరోలకు ఉందని నిరూపణ అయ్యింది. ఖాన్ లు కుమార్ లు కపూర్ లు రోషన్ లు డియోల్ లు ఉన్న ఇండస్ట్రీని డామినేట్ చేస్తూ టాలీవుడ్ టాప్ స్టార్లు ప్రభాస్ - రామ్ చరణ్ - తారక రామారావు- అల్లు అర్జున్ దూసుకెళుతున్నారు. వీళ్లకు తోడు కన్నడ రాక్ స్టార్ యష్ కూడా అసాధారణమైన ఎటాక్ చేస్తున్నాడు.
అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజైనా దానిని సౌత్ తో పోల్చి చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2లను కొట్టే సినిమాలేవీ బాలీవుడ్ లో లేవు. ఇప్పట్లో రావు అన్న చర్చా సాగుతోంది. అయితే కనీసం హిట్టు అయినా ఉందా అంటే అదీ లేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత భూల్ భులయా 2 రూపంలో బాలీవుడ్ సంతృప్తి కరమైన విజయాన్ని చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీకి అన్ని వైపులా పాజిటివ్ రివ్యూలు రావడమే దీనికి కారణం. అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ మూవీ 100 కోట్ల క్లబ్ కి మాత్రమే పరిమితం అనడంలో సందేహం లేదు. ఆసక్తికరంగా ఈ మూవీ కోసం ఎంపిక చేసుకున్న కథ కూడా ఒక సౌత్ బ్లాక్ బస్టర్ మూవీ స్ఫూర్తితోనే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి స్ఫూర్తితో రాసుకున్న కథాంశమిది. మొత్తానికి బాలీవుడ్ ని ఆదుకున్నది కూడా ఇప్పుడు సౌత్ స్టోరీనే అని అక్కడి వారు అంగీకరించాలి. హీరో పంతి 2- రన్ వే 34 వంటి చిత్రాలు చేయలేని మ్యాజిక్ భూల్ భులయా2 చేస్తోందటే దానికి కారణం సౌత్ మూలాలను ఆ సినిమా కలిగి ఉండడమే!
భూల్ భులయా 2 బాక్స్ ఆఫీస్ డే 1 (ప్రారంభ ట్రెండ్స్) వివరాల్ని పరిశీలిస్తే..ఫర్వాలేదనే రిపోర్ట్ అందింది. కార్తిక్ ఆర్యన్- టబు- కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రాజ్పాల్ యాదవ్, ..సంజయ్ మిశ్రా, ..రాజేష్ శర్మ,.. అమర్ ఉపాధ్యాయ్,.. సిద్ధాంత్ ఘెగద్మల్ తదితర తారాగణం నటించారు. భూల్ భూలయ్యా 2 సీక్వెల్ సినిమా. అక్షయ్ కుమార్- విద్యాబాలన్- షైనీ అహుజా- అమీషా పటేల్ నటించిన మూవీకి సీక్వెల్ అన్నది తెలిసినదే.
భూల్ భూలయ్యా 2కి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. కంగనా రనౌత్- అర్జున్ రాంపాల్ - దివ్యా దత్తా నటించిన ధాకడ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘర్షణను ఎదుర్కొంది. కార్తిక్ ఆర్యన్ మూవీకి ప్రారంభ ట్రెండ్ ల ప్రకారం మొదటి రోజునే అందరూ ఈ మూవీని లైక్ చేసారు. భూల్ భూలయ్యా 2 మొదటి రోజు మొత్తం 15-17 కోట్లు వసూలు చేయగలిగిందని ఇది అద్భుతమైన ఫలితం అంటూ తాజా మీడియా కథనాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంతకాలంగా బాలీవుడ్ పై వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే.. భూల్ భులయా 2 మొదటి రోజు BO కలెక్షన్లు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. 1వ రోజు కలెక్షన్ను చూస్తే భూల్ భూలయ్యా 2 ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసిందని అద్భుతాలు సృష్టించడానికి మంచి స్క్రిప్ట్ ఎలా అవసరమో చూపించిందని ప్రశంసలు కురుస్తున్నాయి.
మల్టీవర్స్ ఆఫ్ మంజులికాలో అలాంటి ఒక ఆత్మ భవానీగఢ్ (రాజస్థాన్)లోని హవేలీలో చిక్కుకున్న అనంతరం డ్రామా ఏంటనేది ఈ సినిమా. కొన్నాళ్ల తర్వాత ఆమె కుటుంబంలోని ఎవరైనా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుని ఆమెను బయటికి విడుదల చేస్తే ఏం జరిగింది? ఈసారి అడవిలో జరిగిన కథేంటి? తెరపై చూడాలి. ప్రస్తుత కథ రీత్యా (కియారా అద్వానీ) తన ఉన్నత చదువుల తర్వాత తన కుటుంబానికి తిరిగి రావడం.. తన సోదరి ఇష్టపడే వ్యక్తిని బలవంతంగా వివాహం చేసుకోవడం.. అనంతరం చిక్కుల్లో పడడం వగైరా స్టోరీకి బలాలుగా మారాయి. ఓవరాల్ గా చంద్రముఖి లైన్ ని తెలివిగా అనీష్ బజ్మి ఉపయోగించుకున్నారు. అయితే కథనం బలంగా ఉండడం వల్ల మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది.
ఇప్పుడు చూసే కళ్లు మారాయి.. ఆలోచించే మెదళ్లు మారాయి. బాలీవుడ్ ని కొట్టే ఇండస్ట్రీగా టాలీవుడ్ నిరూపించుకోవడమే దీనికి కారణం. ఖాన్ ల త్రయానికి సైతం చెమటలు పట్టించే రేంజు టాలీవుడ్ హీరోలకు ఉందని నిరూపణ అయ్యింది. ఖాన్ లు కుమార్ లు కపూర్ లు రోషన్ లు డియోల్ లు ఉన్న ఇండస్ట్రీని డామినేట్ చేస్తూ టాలీవుడ్ టాప్ స్టార్లు ప్రభాస్ - రామ్ చరణ్ - తారక రామారావు- అల్లు అర్జున్ దూసుకెళుతున్నారు. వీళ్లకు తోడు కన్నడ రాక్ స్టార్ యష్ కూడా అసాధారణమైన ఎటాక్ చేస్తున్నాడు.
అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజైనా దానిని సౌత్ తో పోల్చి చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2లను కొట్టే సినిమాలేవీ బాలీవుడ్ లో లేవు. ఇప్పట్లో రావు అన్న చర్చా సాగుతోంది. అయితే కనీసం హిట్టు అయినా ఉందా అంటే అదీ లేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత భూల్ భులయా 2 రూపంలో బాలీవుడ్ సంతృప్తి కరమైన విజయాన్ని చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీకి అన్ని వైపులా పాజిటివ్ రివ్యూలు రావడమే దీనికి కారణం. అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ మూవీ 100 కోట్ల క్లబ్ కి మాత్రమే పరిమితం అనడంలో సందేహం లేదు. ఆసక్తికరంగా ఈ మూవీ కోసం ఎంపిక చేసుకున్న కథ కూడా ఒక సౌత్ బ్లాక్ బస్టర్ మూవీ స్ఫూర్తితోనే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి స్ఫూర్తితో రాసుకున్న కథాంశమిది. మొత్తానికి బాలీవుడ్ ని ఆదుకున్నది కూడా ఇప్పుడు సౌత్ స్టోరీనే అని అక్కడి వారు అంగీకరించాలి. హీరో పంతి 2- రన్ వే 34 వంటి చిత్రాలు చేయలేని మ్యాజిక్ భూల్ భులయా2 చేస్తోందటే దానికి కారణం సౌత్ మూలాలను ఆ సినిమా కలిగి ఉండడమే!
భూల్ భులయా 2 బాక్స్ ఆఫీస్ డే 1 (ప్రారంభ ట్రెండ్స్) వివరాల్ని పరిశీలిస్తే..ఫర్వాలేదనే రిపోర్ట్ అందింది. కార్తిక్ ఆర్యన్- టబు- కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రాజ్పాల్ యాదవ్, ..సంజయ్ మిశ్రా, ..రాజేష్ శర్మ,.. అమర్ ఉపాధ్యాయ్,.. సిద్ధాంత్ ఘెగద్మల్ తదితర తారాగణం నటించారు. భూల్ భూలయ్యా 2 సీక్వెల్ సినిమా. అక్షయ్ కుమార్- విద్యాబాలన్- షైనీ అహుజా- అమీషా పటేల్ నటించిన మూవీకి సీక్వెల్ అన్నది తెలిసినదే.
భూల్ భూలయ్యా 2కి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. కంగనా రనౌత్- అర్జున్ రాంపాల్ - దివ్యా దత్తా నటించిన ధాకడ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘర్షణను ఎదుర్కొంది. కార్తిక్ ఆర్యన్ మూవీకి ప్రారంభ ట్రెండ్ ల ప్రకారం మొదటి రోజునే అందరూ ఈ మూవీని లైక్ చేసారు. భూల్ భూలయ్యా 2 మొదటి రోజు మొత్తం 15-17 కోట్లు వసూలు చేయగలిగిందని ఇది అద్భుతమైన ఫలితం అంటూ తాజా మీడియా కథనాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంతకాలంగా బాలీవుడ్ పై వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే.. భూల్ భులయా 2 మొదటి రోజు BO కలెక్షన్లు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. 1వ రోజు కలెక్షన్ను చూస్తే భూల్ భూలయ్యా 2 ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసిందని అద్భుతాలు సృష్టించడానికి మంచి స్క్రిప్ట్ ఎలా అవసరమో చూపించిందని ప్రశంసలు కురుస్తున్నాయి.
మల్టీవర్స్ ఆఫ్ మంజులికాలో అలాంటి ఒక ఆత్మ భవానీగఢ్ (రాజస్థాన్)లోని హవేలీలో చిక్కుకున్న అనంతరం డ్రామా ఏంటనేది ఈ సినిమా. కొన్నాళ్ల తర్వాత ఆమె కుటుంబంలోని ఎవరైనా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుని ఆమెను బయటికి విడుదల చేస్తే ఏం జరిగింది? ఈసారి అడవిలో జరిగిన కథేంటి? తెరపై చూడాలి. ప్రస్తుత కథ రీత్యా (కియారా అద్వానీ) తన ఉన్నత చదువుల తర్వాత తన కుటుంబానికి తిరిగి రావడం.. తన సోదరి ఇష్టపడే వ్యక్తిని బలవంతంగా వివాహం చేసుకోవడం.. అనంతరం చిక్కుల్లో పడడం వగైరా స్టోరీకి బలాలుగా మారాయి. ఓవరాల్ గా చంద్రముఖి లైన్ ని తెలివిగా అనీష్ బజ్మి ఉపయోగించుకున్నారు. అయితే కథనం బలంగా ఉండడం వల్ల మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది.