Begin typing your search above and press return to search.

సౌందర్య లెక్కలు ఇంకా తెలలేదా?

By:  Tupaki Desk   |   6 July 2020 9:30 AM GMT
సౌందర్య లెక్కలు ఇంకా తెలలేదా?
X
తెలుగు ప్రేక్షకులు సావిత్రి తర్వాత ఇప్పటికి అంతగా అభిమానించే నటి సౌందర్య. హీరోయిన్ గా తెలుగుతో పాటు పలు భాషల్లో అలరించిన సౌందర్య హెయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెంది 16 ఏళ్ళు అయినా కూడా ఆమె ఆస్తి తగాదాలు ఇంకా తెగలేదు. ఆ సమయంలోనే సౌందర్య ఆస్తి వీలుగా దాదాపుగా 100 కోట్ల వరకు ఉంటుందని అంచన.

సంపాదించిన ప్రతి పైసా కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టిన కారణంగా ఆ స్థాయిలో ఆస్తి పెరిగినట్లుగా చెబుతున్నారు. సౌందర్య తో పాటు ఆమె అన్న కూడా మృతి చెందాడు. 2009 వ సంవత్సరం నుండి కూడా తల్లిదండ్రులు ఇంకా వదిన మధ్య ఆస్తి తగాదా నడుస్తోంది. కోర్టులో సుదీర్ఘ కాలం వాదనలు తర్వాత 2013వ సంవత్సరంలో రాజీకి సిద్ధం అయ్యారు. సౌందర్య ఆస్తిలో సగానికి ఎక్కువగా షేర్ చేసుకున్న కుటుంబ సభ్యులు కొన్ని భూముల విషయములు మాత్రం ఇంకా రాజీ పడలేదట.

ఇప్పటికి ఆమె బంధువులు ఆస్తి విషయంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతూనే ఉన్నారని టాక్. హీరోయిన్ గా ఎంతో ఖ్యాతి దక్కించుకున్న సౌందర్య ఆమె కుటుంబ సభ్యుల కారణంగా చనిపోయిన తర్వాత పరువు పోగొట్టుకునే పరిస్థితి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.