Begin typing your search above and press return to search.

ఆ రియల్ హీరోకు 'ఆచార్య ' సెట్స్ 'లో ఘన సన్మానం

By:  Tupaki Desk   |   21 Nov 2020 10:10 AM GMT
ఆ రియల్ హీరోకు ఆచార్య  సెట్స్ లో ఘన సన్మానం
X
కరోనా లాక్​డౌన్​లో రియల్​ హీరో అనిపించుకున్న సోనూసూద్​.. మరోసారి దక్షిణాదిపై తన ప్రేమను వ్యక్తం చేశారు. సౌత్​ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక్కడ షూటింగ్ లో ఉంటే సొంత ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు సౌత్​ అంటే ఎంతో ఎనలేని ఇష్టమని కూడా చెప్పారు. లాక్​డౌన్​ టైంలో ఇక్కట్లు పడ్డ వలసబాధితులను, ఉపాధి కోల్పోయిన వాళ్లను, రైతులను, విద్యార్థులను సోనూసూద్​ ఎంతో ఆదుకున్నారు. ఎవరు ఏం అడిగినా తన వంతు సాయం చేశారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు పడుతుండటంతో అతడికి ట్రాక్టర్​ కొనిచ్చాడు. ఎందరో వలసకార్మికులను సొంతడబ్బు పెట్టి స్వగ్రామాలకు పంపించాడు. ఎందరో చిన్నారులకు ఆన్​లైన్​ చదువుల కోసం ల్యాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్లు కొనిచ్చాడు. కొన్ని గ్రామాలకు విద్యుత్​ సౌకర్యం కూడా కల్పించాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే సోనూసూద్​ చేసిన సాయాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆయనను అంతా రియల్​ హీరో అని పొగిడారు. సోషల్​మీడియాలో ఆయన ఖ్యాతీ పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం సోనూసూద్​ మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​లో సోనూ సూద్ బిజీగా ఉన్నారు. కాగా అదే సినిమా సెట్​లో ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి, డైరెక్టర్‌ కొరటాల శివ కరోనా బాధితులకు సోనూసూద్ చేసిన సేవలకు గాను ప్రత్యేకంగా సత్కరించారు. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టీమ్‌ సభ్యులు కూడా పాల్గొన్నారు.

కరోనా టైంలో సోనూసూద్‌ పేదలకు ఆదుకొని ఎందరికో స్ఫూర్తినిచ్చారని తనికెళ్ల భరణి కొనియాడారు. ఈ సంద్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుందని, ఇక్కడ ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేననన్నారు.