Begin typing your search above and press return to search.

#SSMB27 లాంచ్.. య‌థావిధిగా స్కిప్ కొట్టిన మ‌హేష్‌

By:  Tupaki Desk   |   21 Nov 2020 1:30 PM GMT
#SSMB27 లాంచ్.. య‌థావిధిగా స్కిప్ కొట్టిన మ‌హేష్‌
X
సూపర్ స్టార్ మహేష్ మ‌ళ్లీ స్కిప్ కొట్టారు. ముహూర్త‌పు స‌న్నివేశం అంటేనే ఆయ‌నకు గిట్ట‌దు. పూజా కార్య‌క్ర‌మాల‌ స్పాట్ లో మిస్స‌వుతుంటారు. అది ఎందుకు? అంటే అదంతే..!! అనాదిగా దీనిని ఒక సెంటిమెంట్ గా కొన‌సాగిస్తున్నారు. గ‌డిచిన ఐదారేళ్లుగా తాను న‌టించే ఏ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి ఆయ‌న లేరు. ప్రాథ‌మికంగా జ‌రిగే ఠెంకాయ కార్య‌క్ర‌మంలో ఆయ‌న భాగం కాలేదు.

శ్రీ‌మంతుడు - భ‌ర‌త్ అనే నేను- మ‌హ‌ర్షి- స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా ఏ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మం చూసినా ఆయ‌న లేరు. కేవ‌లం చిత్ర‌బృందం మాత్ర‌మే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించారు.

తాజాగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలోని స‌ర్కార్ వారి పాట లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. మైత్రీ మూవీ మేకర్స్- జీఎమ్ బి ఎంటర్ టైన్మెంట్- 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నేడు (న‌వంబర్ 21న) KPHB నాలుగో లేన్ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో 11:43 కి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. మొద‌టి షాట్ కి ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా.. నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కాశీనాధునిపై ముహూర్త‌పు స‌న్నివేశం తెర‌కెక్కించారు.

షెడ్యూల్ వివ‌రంలోకి వెళితే.. జ‌న‌వ‌రి తొలి వారంలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభిస్తారు. అమెరికాలో మేజ‌ర్ షెడ్యూల్ ఉంటుంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. వెన్నెల కిషోర్.. సుబ్బ‌రాజు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. నేటి పూజా కార్య‌క్ర‌మాల్లో మ‌హేష్ మినహా చిత్ర‌బృందం పాల్గొంది. మ‌హేష్ మిస్సింగ్ పైనా అభిమానులు ఆరాలు తీసారు. అయితే ఆయ‌న సెంటిమెంట్ ప్ర‌కార‌మే య‌థావిధిగా ముహూర్త‌పు షాట్ కి అటెండ్ కాలేద‌ని భావించాల్సి ఉంటుంది.