Begin typing your search above and press return to search.

శింబు సోషల్​మీడియా ఎంట్రీ.. పాత రికార్డులు బద్దలైపోతాయా?

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:00 PM GMT
శింబు సోషల్​మీడియా ఎంట్రీ..  పాత రికార్డులు బద్దలైపోతాయా?
X
తమిళనాట శింబూకు మాస్​ హీరోగా ఎంతో క్రేజ్​ ఉంది. అగ్ర హీరోల్లో అతడు కూడా ఒకరు. హిట్, ప్లాప్ లకు అతీతంగా అతడికి ఇమేజ్ ఉంది. అతడు చేసే డ్యాన్స్​కు అభిమానులు మెస్మరైజ్​ అవుతుంటారు. మాస్​ జనంలో శింబూ ఫాలోయింగ్​ మామూలుగా ఉండదు. ఇటు క్లాస్​ జనాలు కూడా శింబూను విపరీతంగా అభిమానిస్తారు. అందరూ హీరోలు సోషల్​మీడియాలో యాక్టివ్​గా ఉంటున్న ప్రస్తుత తరుణంలో శింబూకు మాత్రం ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టా లాంటి సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు లేవు. ఈ విషయంపై అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.

అదీ కాక ఈ మధ్యకాలంలో హీరో, హీరోయిన్లందరూ సోషల్​ మీడియా ద్వారానే అభిమానులకు చేరువతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్​ను పంచుకుంటూ.. ఫ్యాన్స్​తో ముచ్చటిస్తూ వారిలో జోష్ నింపుతున్నారు. అయితే శింబూ అభిమానులు మాత్రం ఈ విషయంలో నిరాశగా ఉన్నారు. దీంతో అభిమానుల కోసం శింబూ సోషల్​ మీడియా ఫ్లాట్​ ఫారంలోకి రాబోతున్నాడు. అక్టోబర్ 22 న ఉదయం 9:09 గంటలకు నటుడు శింబూకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఓపెన్​ కానున్నాయి. శింబూ ప్రస్తుతం ‘మన్నాడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్​లో గ్లామర్​ తార త్రిషను శింబు పెళ్లిచేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వీటిపై వాళ్లిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.