Begin typing your search above and press return to search.

సుశాంత్‌ వ్యవసాయం చేయాలనుకున్నాడు

By:  Tupaki Desk   |   4 Aug 2020 1:30 AM GMT
సుశాంత్‌ వ్యవసాయం చేయాలనుకున్నాడు
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా రెండు నెలలు అవ్వబోతుంది. అయినా ఇప్పటికి కూడా సోషల్‌ మీడియాలో ఆయనకు సంబంధించిన చర్చ ట్రెండ్‌ అవుతూనే ఉంది. ముంబయి పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదు అనే అనుమానంతో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగడంతో అనూహ్యంగా పలు నిజాలు బయటకు వస్తున్నాయి. రియా చక్రవర్తి గత ఏడాది కాలంగా సుశాంత్‌ నుండి కోట్లు లాగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన కొన్ని ఆఫర్లను కొందరి వల్ల పోగొట్టుకున్నాడని కూడా టాక్‌ వినిపిస్తుంది.

ఈ సమయంలో సుశాంత్‌ కు రూంమెట్‌ మరియు ఆప్త మిత్రుడు అయిన సిద్దార్థ్‌ పితాని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. గత ఏడాది కాలంగా సుశాంత్‌ డిప్రెషన్‌ తో బాధపడుతున్నాడు. ఒకానొక సమయంలో నాతో సినిమాలను వదిలేయాలనుకుంటున్నట్లుగా చెప్పాడు. ముంబయి వదిలేసి తన ఫామ్‌ హౌస్‌ లో వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడపాలని కూడా భావిస్తున్నట్లుగా చెప్పాడు.

ఒక సమయంలో నాతో కొత్త బిజినెస్‌ ప్రారంభిద్దాం అన్నాడు. ఆ బిజినెస్‌ ను నువ్వే చూసుకోవాలి నీకు మంచి జీతం ఇస్తానంటూ కూడా చెప్పాడు. వర్చువల్‌ వీడియో బిజినెస్‌కు మంచి మార్కెట్‌ ఉంది కనుక దాన్ని చేద్దాం అంటూ సుశాంత్‌ చెప్పాడు. ఇంతలోనే ఇలా అయ్యిందని సిద్దార్థ ఆ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. సుశాంత్‌ మృతి విషయంలో సిద్దార్థ్‌ పై కూడా కొందరు అనుమానాలు వ్యక్థం చేస్తున్నారు. మొన్నటి వరకు రియా సేన్‌ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నాడు అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.