Begin typing your search above and press return to search.
మీసం మెలి తిప్పిన శ్యాం సింఘరాయ్..ఏంటీ కథాకమామీషు?
By: Tupaki Desk | 25 Oct 2020 12:10 PM GMTనేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యాం సింఘరాయ్. నాని సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఎంసీఏ చిత్రంలో వీరిద్దరు తొలిసారి కలిసి నటించారు. ఈ క్రేజీ జంట రెండోసారి కలిసి నటించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రకటించారు. కరోనా ప్రభావంతో షూటింగ్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
నవ్యమైన అంశాలున్న ఇతివృత్తంతో ఈ మూవీ తెరకెక్కుందని తెలుస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన విషయాల్ని చిత్రబృందం మరోసారి అధికారికంగా ప్రకటించింది. దసరా పోస్టర్ లో టైటిల్ కి తగ్గట్టే కథానాయకుడి మెలి తిప్పిన మీసం ఆసక్తిని పెంచుతోంది. `వి` రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈసారి ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో నాని పని చేస్తున్నారట. ఎట్టకేలకు ప్రీప్రొడక్షన్ సహా అన్నిపనులు పూర్తి చేసి ఈ డిసెంబర్ నుంచి చిత్రీకరణకు వెళ్లనున్నామని వెల్లడించారు. ఇద్దరు నేచురల్ పెర్ఫామర్స్ కలయికలో తెరకెక్కనున్న మూవీ కాబట్టి సినిమాపై తొలి నుంచి అంచనాలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిక్కీ జే మేయర్ సంగీతం .. మెలోడీ ఈ మూవీకి అస్సెట్ కానున్నాయి.
ఇక నాని లాంటి క్రేజీ హీరోతో సినిమా తీస్తున్న నిర్మాతగా వెంకట్ బోయనాపల్లి టీమ్ లో చేరడం ఆసక్తిని పెంచుతోంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన ఇప్పటికే అనేక సినిమాలకు నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అనుభవజ్ఞుడు అని తెలుస్తోంది. టాక్సీ వాలా చిత్రంతో హిట్టు కొట్టి మ్యాజిక్ చేసిన దర్శకుడిగా రాహుల్ పైనా టీమ్ నమ్మకంగా ఉంది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచేందుకు దర్శకనిర్మాతలు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని సమాచారం. మరిన్ని సంగతులు చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.
నవ్యమైన అంశాలున్న ఇతివృత్తంతో ఈ మూవీ తెరకెక్కుందని తెలుస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన విషయాల్ని చిత్రబృందం మరోసారి అధికారికంగా ప్రకటించింది. దసరా పోస్టర్ లో టైటిల్ కి తగ్గట్టే కథానాయకుడి మెలి తిప్పిన మీసం ఆసక్తిని పెంచుతోంది. `వి` రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈసారి ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో నాని పని చేస్తున్నారట. ఎట్టకేలకు ప్రీప్రొడక్షన్ సహా అన్నిపనులు పూర్తి చేసి ఈ డిసెంబర్ నుంచి చిత్రీకరణకు వెళ్లనున్నామని వెల్లడించారు. ఇద్దరు నేచురల్ పెర్ఫామర్స్ కలయికలో తెరకెక్కనున్న మూవీ కాబట్టి సినిమాపై తొలి నుంచి అంచనాలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిక్కీ జే మేయర్ సంగీతం .. మెలోడీ ఈ మూవీకి అస్సెట్ కానున్నాయి.
ఇక నాని లాంటి క్రేజీ హీరోతో సినిమా తీస్తున్న నిర్మాతగా వెంకట్ బోయనాపల్లి టీమ్ లో చేరడం ఆసక్తిని పెంచుతోంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన ఇప్పటికే అనేక సినిమాలకు నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అనుభవజ్ఞుడు అని తెలుస్తోంది. టాక్సీ వాలా చిత్రంతో హిట్టు కొట్టి మ్యాజిక్ చేసిన దర్శకుడిగా రాహుల్ పైనా టీమ్ నమ్మకంగా ఉంది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచేందుకు దర్శకనిర్మాతలు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని సమాచారం. మరిన్ని సంగతులు చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.