Begin typing your search above and press return to search.

30 రోజుల్లో షూటింగ్‌.. 10 రోజుల్లో రిలీజ్‌ ప్లాన్‌

By:  Tupaki Desk   |   25 July 2021 11:30 PM GMT
30 రోజుల్లో షూటింగ్‌.. 10 రోజుల్లో రిలీజ్‌ ప్లాన్‌
X
టాలీవుడ్ లో డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కామెడీ సినిమాలను తీయడంలో తన తర్వాతే ఎవరైనా అని మారుతి ముద్ర వేయించుకున్నాడు. తన జర్నీ మొదలైన నాటి నుంచి నేటి వరకు సినిమాలను జెట్ స్పీడ్ తో తెరకెక్కిస్తూ... ఔరా అనిపిస్తుంటాడు. అప్పట్లో వచ్చిన ఈ రోజుల్లో మూవీ దగ్గర్నుంచి, ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మంచి రోజులు వచ్చాయి మూవీ వరకు తన స్పీడ్ పెరిగిందే కానీ తగ్గలేదంటున్నారు సినీ జనాలు. అంతలా స్పీడ్ గా సినిమాలను తెరకెక్కించడంలో మారుతి దిట్ట. తన జర్నీలో భలే భలే మగాడివోయ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను సైతం అందించారు. మహానుభావుడు వంటి కామెడీ కథను చేసి హిట్ సాధించాలన్నా.. అది కేవలం మారుతికే సాధ్యమవుతుంది.

ప్రస్తుతం మారుతి చేస్తున్నే మంచి రోజులు వచ్చాయి అనే మూవీ గురించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ఎవరైనా సరే సినిమా కథను రాయడానికి ఓ ఆర్నెల్లో ఏడాదో టైం తీసుకుంటూ ఉంటారు. కానీ మారుతి మాత్రం అలా కాదు. కేవలం 20 అంటే 20 రోజుల్లోనే కథను పూర్తి చేశాడు. జెట్ స్పీడ్ తో కథను పూర్తి చేయడం మాత్రమే కాదు అంతకన్నా.. జెట్ స్పీడ్ తో కేవలం 30 రోజుల్లోనే సినిమాను కంప్లీట్ చేసేసాడు.

కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూతపడి ఉన్నాయి కాబట్టి రిలీజ్ కు లేటవుతుంది కానీ లేకుంటే ఎప్పుడో మూవీ రిలీజ్ అయ్యేది ప్రేక్షకులు చూసేసి ఉండేవారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మంచి రోజులు వచ్చాయి చిత్రంలో అందాల అమ్మడు మెహ్రీన్ కౌర్, ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయిన సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మారుతి గోపీచంద్‌ హీరోగా పక్కా కమర్షియల్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఇంతవరకు అపజయమే చూడని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇది వరకే రాశీఖన్నా, గోపీచంద్ జిల్, ఆక్సీజన్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ అనే యువ సంగీత దర్శకుడు మ్యూజిక్ సమకూర్చడం విశేషం. ఇప్పటికే జీఏ2 బ్యానర్ లో మారుతి పలు హిట్ సినిమాలు తీశాడు.

గోపీచంద్ కి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో కామెడీ స్టార్ డైరెక్టర్ గా పేరున్న మారుతిని నమ్ముకుని పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో అందాల బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా చేస్తుండడంతో అభిమానుల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా మంచి రోజులు వచ్చాయి సినిమా టీజర్ లాంచ్ సమయంలో మారుతి చేసిన కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. షూటింగ్ పూర్తయిన 10 రోజుల్లోపే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఆయన వివరించాడు.