Begin typing your search above and press return to search.

మీడియా ప్రతినిధులకు.. చానళ్లకు కేసులతో షాకిచ్చిన శిల్పాశెట్టి

By:  Tupaki Desk   |   30 July 2021 3:23 AM GMT
మీడియా ప్రతినిధులకు.. చానళ్లకు కేసులతో షాకిచ్చిన శిల్పాశెట్టి
X
తీవ్రమైన ఒత్తిడి.. దారుణమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఎంతటి తెలివైన వాడు అయినప్పటికి తెలివి తక్కువ తప్పులు చేస్తారు. చేయాల్సిన ఎదవ పనులు చేసి.. చట్టం చేతికి అడ్డంగా బుక్ అయి బెయిల్ కోసం ప్రయత్నించి.. ఎదురుదెబ్బలు తగిలి ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త కమ్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా. చేసిన తప్పుల విషయంలో రోజుకో కొత్త న్యూస్ వస్తోంది.

బూతు సినిమాల్ని తీసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా నిజింగా అలా చేశారా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ముంబయి పోలీసులు ఒక్క మాటను కూడా తెరమీదకు తీసుకొచ్చారు. అయితే.. అందుకు భిన్నంగా మీడియా ప్రతినిధులు మాత్ర.. రాజ్ కుద్రా ఎపిసోడ్ ను గంటల వారీగా ఎప్పుడేం జరుగుతుందన్న విషయాన్ని చానళ్లు బయటపెడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ తరహా కేసుల వివరాలు కొంత మేర పట్టుక

తాజాగా మీడియా ప్రతినిధులకు.. పలు మీడియా సంస్థకు దిమ్మ తిరిగేలా రియాక్టు అయ్యారు శిల్పా శెట్టి. తన భర్త రాజ్ కుంద్రాతో పాటు తన కుటుంబానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా కథనాలు పబ్లిష్ చేశారని ఆరోపించింది. మొత్తం 29 మీడియా సంస్థలకు.. పలువురు మీడియా ప్రతినిధులపైనా ఆమె కేసులు వేశారు. ఈ కేసు లు ఎంత తీవ్రంగా మారతాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తమ పేరు ప్రఖ్యాతుల్ని తగ్గించేలా సదరు వార్తలు వస్తున్నాయని.. అందుకే న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా శిల్ప కేసులు వేసిందని చెబుతున్నారు.

ఒక సంచలన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు.. అందులోనూ ఒక భారీ సెలబ్రిటీకి సంబంధించిన వ్యవహారం అయితే మీడియా ప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారు? చానళ్ల మాటేమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే..మిగిలినప విషయాల్ని పట్టించుకోకుండా కేవలం చానళ్లు.. మీడియా ప్రతినిధులు తమ పరువు తీస్తున్నారంటూ వస్తున్న కథనాలపై ఆమె భారీగా షాకులు ఇచ్చేందుకు రెఢీ అయిపోతున్నారు. ఇప్పుడున్న కేసులు సరిపోవన్నట్లుగా శిల్పా కేసులు వేయటం కాసింత తొందరపాటు చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ ఉదంతంలో మరేం జరుగుతుందో చూడాలి.