Begin typing your search above and press return to search.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' దసరా స్పెషల్ సూపర్‌

By:  Tupaki Desk   |   15 Oct 2021 5:19 AM GMT
ఆడవాళ్లు మీకు జోహార్లు దసరా స్పెషల్ సూపర్‌
X
శర్వానంద్‌ హీరోగా రూపొందిన మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సమయంలోనే శర్వా మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. దసరా సందర్బంగా సినిమా నుండి పోస్టర్ ను విడుదల చేశారు. స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న ఈ సినిమా దసరా పోస్టర్‌ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. పండుగ వాతావరణం కనిపిస్తున్న ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఈ సినిమాలో రష్మిక లుక్ చూస్తుంటే గీత గోవిందం మరియు భీష్మలోని ఆమె లుక్ గుర్తుకు వస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో అంటూ సెంటిమెంట్‌ వ్యాఖ్యలను కొందరు చేస్తున్నారు. మొత్తానికి ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకంను పోస్టర్ కలిగిస్తుంది.

సుధాకర్ చెరుకూరి ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. కిషోర్‌ తిరుమల వరుస సక్సెస్‌ లను దక్కించుకుని మోస్ట్‌ క్రేజీ దర్శకుడిగా పేరు దక్కించుకుంది. లవ్‌ స్టోరీ కమ్‌ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. అలాంటి కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో శర్వానంద్ మరియు రష్మికలకు ఒక మంచి కమర్షియల్‌ బ్రేక్ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శర్వానంద్ చాలా కూల్ లుక్‌ లో శతమానం భవతిలో ఎలా అయితే కనిపించాడో అలా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఫ్యామిలీ సినిమాగా ఉండబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు కోసం శర్వానంద్ అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.