Begin typing your search above and press return to search.

ర‌ష్మిక మీద‌నే హోప్స్ పెట్టుకున్న యువ హీరో..!

By:  Tupaki Desk   |   4 Dec 2021 4:30 AM GMT
ర‌ష్మిక మీద‌నే హోప్స్ పెట్టుకున్న యువ హీరో..!
X
వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపైనే శర్వా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే యువ హీరో కెరీర్ ఇప్పుడు సాఫీగా సాగడం లేదు. విభిన్నమైన చిత్రాలతో అలరించే శర్వా.. వరుసగా ఐదు ప్లాప్స్ చవి చూడాల్సి వచ్చింది.

ఎన్నో అంచనాల మధ్య ఇటీవల వచ్చిన 'మహాసముద్రం'.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'శ్రీకారం' సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో శర్వానంద్ కు అర్జెంట్ గా ఒక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మీద రష్మిక మందన్నా మీదనే శర్వా హోప్స్ పెట్టుకున్నారనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక కు కాస్త అదృష్టం కూడా కలిసి రావడంతో.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో అదరగొడుతూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి.. 'పుష్ప: ది రైజ్' మరింత క్రేజ్ తెచ్చిపెట్టనుంది.

ఇదంతా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. 'పుష్ప' తర్వాత రష్మిక స్టార్ ఇమేజ్ శర్వా ని దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులోను రష్మికని హీరోయిన్ గా తీసుకున్న హీరోలలో ఎక్కువ మంది హిట్స్ అందుకున్న వారే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ బ్యూటీకి ఉన్న లక్.. శర్వానంద్ కు కూడా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఖుష్బూ - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'లూసిఫర్' ఫేమ్ సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.