Begin typing your search above and press return to search.
పఠాన్ పెను సంచలనం.. అప్పుడే రూ. 500 కోట్లకు..
By: Tupaki Desk | 29 Jan 2023 4:00 PM GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాలీవుడ్కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తోంది. ఆయన గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో కలిసి నాలుగోసారి జంటగా నటించిన చిత్రమే పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
దీంతో అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. బాద్షా తన స్టామినా మరోసారి నిరూపించారని అంటున్నారు.విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలను ఎదుర్కొన్నా ఈ చిత్రం.. ఇప్పుడు వారి నోళ్లను ముయించిందని పేర్కొంటున్నారు. తమ కలెక్షన్లతో వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని అంటున్నారు.
ఇక పోతే తొలి రోజు మతిపోగొట్టే ఓపెనింగ్స్ కలెక్షన్స్ను అందుకున్న ఈ మూవీ.. నాలుగు రోజులు పూర్తయ్యే సరికి శనివారం నాటికి అంతకుమించిన రేంజ్లో వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్గా దాదాపు రూ. 214 కోట్లు వరకూ నెట్ అలాగే, రూ. 417 గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక్క నాలుగో రోజే ఈ చిత్రానికి ఓవరాల్గా రూ. 104 కోట్లు గ్రాస్, రూ. 53 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది. తద్వారా ఎన్నో రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టేసింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2' పేరిట ఉన్న ఐదు రోజులు, 'బాహుబలి 2' పేరిట ఉన్న ఆరు రోజులు రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక ఆదివారం హాలిడే కావడం వల్ల.. ఈరోజు కూడా మరో 100 కోట్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని చెబుతున్నారు. కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా షారుక్ ఖాన్ అదరగొట్టేశారు. దీపికా పడుకొణె హీరోయిన్. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించగా.. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరిశారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
దీంతో అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. బాద్షా తన స్టామినా మరోసారి నిరూపించారని అంటున్నారు.విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలను ఎదుర్కొన్నా ఈ చిత్రం.. ఇప్పుడు వారి నోళ్లను ముయించిందని పేర్కొంటున్నారు. తమ కలెక్షన్లతో వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని అంటున్నారు.
ఇక పోతే తొలి రోజు మతిపోగొట్టే ఓపెనింగ్స్ కలెక్షన్స్ను అందుకున్న ఈ మూవీ.. నాలుగు రోజులు పూర్తయ్యే సరికి శనివారం నాటికి అంతకుమించిన రేంజ్లో వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్గా దాదాపు రూ. 214 కోట్లు వరకూ నెట్ అలాగే, రూ. 417 గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక్క నాలుగో రోజే ఈ చిత్రానికి ఓవరాల్గా రూ. 104 కోట్లు గ్రాస్, రూ. 53 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది. తద్వారా ఎన్నో రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టేసింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2' పేరిట ఉన్న ఐదు రోజులు, 'బాహుబలి 2' పేరిట ఉన్న ఆరు రోజులు రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక ఆదివారం హాలిడే కావడం వల్ల.. ఈరోజు కూడా మరో 100 కోట్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని చెబుతున్నారు. కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా షారుక్ ఖాన్ అదరగొట్టేశారు. దీపికా పడుకొణె హీరోయిన్. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించగా.. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరిశారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.