Begin typing your search above and press return to search.
సలార్ తర్వాత ప్రభాస్ కోసం సెన్సేషనల్ స్క్రిప్ట్
By: Tupaki Desk | 25 Sep 2021 2:30 AM GMTకేజీఎఫ్ చిత్రంతో సంచలనాలు సృష్టించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్- 2తో మరో లెవల్లో సంచలనాలకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఏ సినిమా చేయబోతున్నాడు? అన్నదానికి కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం సాలార్ కోసం ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేస్తున్న ప్రభాస్ తదుపరి మరో చిత్రానికి అతడికి కమిట్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితమైన ఈ ప్రాజెక్ట్ అని తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా `పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్` అని తెలిసింది. దీని కోసం ప్రభాస్ - ప్రశాంత్ నీల్ మళ్లీ సహకరిస్తారు. తాజా లీకుల ప్రకారం.. ప్రశాంత్ ప్రభాస్ కోసం ఒక సంచలన స్క్రిప్ట్ రాశాడు. పౌరాణిక అంశాలను కలిగి ఉండే స్క్రిప్ట్ తో ముందుకు వచ్చాడు. భారతీయ సినిమా తెరపై మునుపెన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఆదిపురుష్ తర్వాత ఇది అతని రెండవ పౌరాణిక చిత్రం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఊపిరాడని షెడ్యూళ్లతో బిజీ
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాల్ని ప్రారంభించాడు. రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజవుతుండగా.. సలార్ -ఆదిపురుష్ 3డి చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. పనిలో పనిగా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించి షెడ్యూళ్లకు సహకరిస్తున్నాడు.ఇంతలోనే ప్రభాస్ నటించే 25వ సినిమా గురించి ఆసక్తికర విషయం రివీలైంది. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తారు. ఇప్పటికే `వ్రిందావన` అనే టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా కేటగిరీలో కథాంశాన్ని సిద్ధం చేయించాడని తెలిసింది. ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఈ సినిమాను ప్రారంభిస్తారట. అయితే ఊపిరాడని ఈ షెడ్యూల్స్ ఉన్నా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి మరో సినిమా చేస్తానని కమిటయ్యాడు. అది బాహుబలి ని మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని అర్థమవుతోంది.
ప్రస్తుతం సాలార్ కోసం ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేస్తున్న ప్రభాస్ తదుపరి మరో చిత్రానికి అతడికి కమిట్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితమైన ఈ ప్రాజెక్ట్ అని తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా `పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్` అని తెలిసింది. దీని కోసం ప్రభాస్ - ప్రశాంత్ నీల్ మళ్లీ సహకరిస్తారు. తాజా లీకుల ప్రకారం.. ప్రశాంత్ ప్రభాస్ కోసం ఒక సంచలన స్క్రిప్ట్ రాశాడు. పౌరాణిక అంశాలను కలిగి ఉండే స్క్రిప్ట్ తో ముందుకు వచ్చాడు. భారతీయ సినిమా తెరపై మునుపెన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఆదిపురుష్ తర్వాత ఇది అతని రెండవ పౌరాణిక చిత్రం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఊపిరాడని షెడ్యూళ్లతో బిజీ
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాల్ని ప్రారంభించాడు. రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజవుతుండగా.. సలార్ -ఆదిపురుష్ 3డి చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. పనిలో పనిగా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించి షెడ్యూళ్లకు సహకరిస్తున్నాడు.ఇంతలోనే ప్రభాస్ నటించే 25వ సినిమా గురించి ఆసక్తికర విషయం రివీలైంది. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తారు. ఇప్పటికే `వ్రిందావన` అనే టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా కేటగిరీలో కథాంశాన్ని సిద్ధం చేయించాడని తెలిసింది. ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఈ సినిమాను ప్రారంభిస్తారట. అయితే ఊపిరాడని ఈ షెడ్యూల్స్ ఉన్నా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి మరో సినిమా చేస్తానని కమిటయ్యాడు. అది బాహుబలి ని మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని అర్థమవుతోంది.