Begin typing your search above and press return to search.

లవ్‌ స్టోరీని ముగించేందుకు కమ్ముల ప్రయత్నం

By:  Tupaki Desk   |   12 Aug 2020 2:30 AM GMT
లవ్‌ స్టోరీని ముగించేందుకు కమ్ముల ప్రయత్నం
X
నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. షూటింగ్‌ చివరి దశలో ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. సమ్మర్‌ లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కమ్ముల భావించాడు. కాని మహమ్మారి వల్ల షూటింగ్‌ కూడా పూర్తి చేయలేక పోయాడు. శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్రం వెంకటేష్‌ తో అంటూ వార్తలు వస్తున్నాయి. లవ్‌ స్టోరీని పూర్తి చేసి వెంటనే వెంకీతో సినిమాను మొదలు పెట్టాలని కమ్ముల భావిస్తున్నాడట.

అక్టోబర్‌ నుండి రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక విలేజ్‌ సెట్టింగ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా మూడు వారాల పాటు ఆ విలేజ్‌ సెట్‌ లో చిత్రీకరణ జరుపనున్నారట. దాంతో షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లే. బ్యాలన్స్‌ వర్క్‌ ను మరో రెండు వారాల్లో పూర్తి చేస్తారట.

నవంబర్‌ వరకు షూటింగ్‌ ను పూర్తి చేయాలని సంక్రాంతికి సాధ్యం అయితే విడుదల చేయలని భావిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఫిదా’. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని శేఖర్‌ కమ్ముల లవ్‌ స్టోరీని చేశాడు. ఈ చిత్రం కూడా ఫిదా చేయడం ఖాయం అనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.