Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' షురూ అయ్యేది అప్పుడేనా...?

By:  Tupaki Desk   |   5 Jun 2020 11:10 AM GMT
సర్కారు వారి పాట షురూ అయ్యేది అప్పుడేనా...?
X
డైరెక్టర్ పరశురామ్ 'గీతగోవిందం' వంటి భారీ బ్లాక్‌ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. మహేష్ బాబుతో సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ బి చెప్పుకొచ్చిన పరశురామ్ ఎట్టకేలకు మహేష్ తో సినిమా అనౌన్స్ చేసేశారు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ప్రకటించేసారు. ఇటీవల ఈ టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేస్తూ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. 'సరిలేరు నీకెవ్వరూ' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే అనౌన్స్మెంట్ పోస్టర్ లో మహేష్ బ్యాక్ సైడ్ హాఫ్ లుక్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. ఫ్రీ హెయిర్ స్టైల్.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీగా కనిపిస్తున్నాడు.

కాగా 'సర్కారు వారి పాట' మూవీ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ కాబోతోందట. దీనికి తగ్గట్టే మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారట. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వలన.. షూటింగ్స్ కి అనుమతి లభించినా కొన్ని రోజుల సమయం తీసుకునే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో మహేష్‌ కి సరైన జోడీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరోసారి మహేశ్ బాబుతో జతకట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకముందు వీరిద్దరూ కలిసి నటించిన 'భరత్ అనే నేను' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వీరి కాంబినేషన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ ఫాదర్ గా ఒక ప్రముఖ నటుడు నటించబోతున్నాడట. విలన్ గా కూడా ఇతర ఇండస్ట్రీ నుండి ఫేమస్ నటుడిని తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారట. దీనికి సంభందించిన వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.