Begin typing your search above and press return to search.
యుఎస్ వీసాల కోసం మహేష్ టీమ్ వెయిటింగ్!
By: Tupaki Desk | 20 Oct 2020 6:15 AM GMTసూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ `గత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీమేకర్స్, .. 14 రీల్స్ ప్లస్.., జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఈ మూవీ కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం యుఎస్ లో ఫస్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. కానీ ఆ తరువాత మారిన వాతావరణం వల్ల పునరాలోచనలో పడ్డారు. ఫైనల్ గా మళ్లీ యుఎస్లోనే షూట్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం టీమ్ అంతా వీసాల కోసం అప్లై చేసింది కూడా. ప్రస్తుతం వీసాలు ప్రాసెస్ లో వున్నాయి.
నవంబర్ నుంచి షూట్ కి వెళ్లాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే యుఎస్ లో లొకేషన్స్ ని ఫైనల్ చేసేశారు. రెండు నెలల పాటు అక్కడ కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ షూట్ లో తక్కువ మంది మాత్రమే క్రూ వుండనుందట. ఇందు కోసం ఇప్పటికే పరశురామ్ ఏర్పాట్లని కూడా చేసినట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఈ మూవీ కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం యుఎస్ లో ఫస్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. కానీ ఆ తరువాత మారిన వాతావరణం వల్ల పునరాలోచనలో పడ్డారు. ఫైనల్ గా మళ్లీ యుఎస్లోనే షూట్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం టీమ్ అంతా వీసాల కోసం అప్లై చేసింది కూడా. ప్రస్తుతం వీసాలు ప్రాసెస్ లో వున్నాయి.
నవంబర్ నుంచి షూట్ కి వెళ్లాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే యుఎస్ లో లొకేషన్స్ ని ఫైనల్ చేసేశారు. రెండు నెలల పాటు అక్కడ కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ షూట్ లో తక్కువ మంది మాత్రమే క్రూ వుండనుందట. ఇందు కోసం ఇప్పటికే పరశురామ్ ఏర్పాట్లని కూడా చేసినట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.