Begin typing your search above and press return to search.

'సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకోవడం చూశాం'

By:  Tupaki Desk   |   26 Sep 2020 5:31 PM GMT
సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకోవడం చూశాం
X
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో దీపికా పడుకునే - శ్రద్ధా కపూర్‌ - సారా అలీఖాన్‌ - రకుల్ ప్రీత్ సింగ్‌ లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా నేడు (సెప్టెంబర్ 26) సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లు ఎన్సీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రియా వాట్సాప్ చాటింగ్ మరియు ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగున్నర గంటల పాటు సాగిన విచారణలో సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్‌ లు కీలక విషయాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

'చిచోరే' సినిమా తర్వాత సుశాంత్ ఫామ్ హౌజ్‌ లో నిర్వహించిన పార్టీకి వెళ్లినట్లు అంగీకరించిందని.. ఆ పార్టీలో కొద్ది మందే ఉన్నారని.. అక్కడ డ్రింక్స్ మాత్రమే తీసుకున్నారని.. అక్కడ డ్రగ్స్ తీసుకోలేదని.. ఆ పార్టీ నుండి అందరికంటే ముందే వెళ్లిపోయానని శ్రద్ధా కపూర్ చెప్పినట్లు 'టైమ్స్ నౌ' పేర్కొంది. ఇక సారా అలీఖాన్ తన ఫస్ట్ మూవీ 'కేదార్‌ నాథ్' సమయం నుంచి అతనితో మంచి అనుబంధం ఉందని.. అతని ఫార్మ్ హౌస్ లో నిర్వహించే పార్టీలకు అటెండ్ అయ్యాయని.. కానీ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు సదరు ఛానల్ వెల్లడించింది. కొన్ని సారా ఫోటోలను చూపించి నీ చేతిలో ఉన్నవి ఏంటని అడుగగా.. 'అవి సిగరెట్స్ అని.. గంజాయి కాదని' సారా చెప్పినట్లు 'టైమ్స్ నౌ' తెలిపింది. అంతేకాకుండా సారా - శ్రద్ధా ఇద్దరూ కూడా సుశాంత్ షూటింగ్ బ్రేక్ సమయాల్లో డ్రగ్స్ తీసుకోవడం చూశామని చెప్పినట్లు 'టైమ్స్ నౌ' పేర్కొంది. కాగా, డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ - దీపికా పడుకునే లను కూడా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో బృందాలు విచారించిన సంగతి తెలిసిందే.