Begin typing your search above and press return to search.

అప్పుడు మహేష్.. ఇప్పుడు ప్రభాస్ మిస్!

By:  Tupaki Desk   |   28 Feb 2020 12:51 PM GMT
అప్పుడు మహేష్.. ఇప్పుడు ప్రభాస్ మిస్!
X
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ కు కథ చెప్పారంటూ పలువురు దర్శకుల పేర్లు వార్తల్లో వినిపించాయి కానీ నాగ్ అశ్విన్ పేరు అసలెక్కడా వినిపించలేదు. అయితే నాగ్ అశ్విన్ కు పచ్చజెండా ఊపి ప్రభాస్ అందరికీ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.

ఈ ప్రకటనతో ప్రభాస్ కు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న ఇతర డైరెక్టర్లకు నెక్స్ట్ సినిమాకు అవకాశం లేదని తేలిపోయినట్టే. అలాంటివారిలో సందీప్ వంగా ఒకరు. అర్జున్ రెడ్డి'.. 'కబీర్ సింగ్' సినిమాలతో ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ సంచలన విజయాలు సొంతం చేసుకున్న సందీప్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఇంకా సెట్ కాలేదు. మొదట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు కథ వినిపించారని.. మహేష్ కూడా ఇంట్రెస్ట్ చూపించారని అన్నారు కానీ అది సెట్ కాలేదు. అయితే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో సినిమా ఫిక్స్ అయింది. టీ సీరీస్ వారి నిర్మాణంలో ఆ తెరకెక్కుతుందని ప్రకటన కూడా వచ్చింది కానీ లాస్ట్ మినిట్ లో రణబీర్ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

బాలీవుడ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తో సినిమా చేసేందుకు సందీప్ ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. సందీప్ అటు బాలీవుడ్ లో కూడా ఒక బ్లాక్ బస్టర్ నమోదు చేసి ఉండడంతో ప్రభాస్-సందీప్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని అనుకున్నారు. నాగ్ అశ్విన్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అది మిస్ అయినట్టే. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకు స్టార్ హీరోలు దొరకకపోవడం ఆశ్చర్యమే. సందీప్ నెక్స్ట్ సినిమాకు ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో వేచి చూడాలి.