Begin typing your search above and press return to search.

సామ్ కోపం వార్నింగ్ రూపంలో బైటకొచ్చింది!

By:  Tupaki Desk   |   23 Feb 2020 7:30 AM GMT
సామ్ కోపం వార్నింగ్ రూపంలో బైటకొచ్చింది!
X
సమంతా అనగానే ఎప్పుడూ కూల్ గా కనిపించే ఓ క్యూట్ హీరోయిన్ గుర్తుకువస్తుంది. అయితే ఎంత క్యూట్ అయినా ఎంత కూల్ అయినా ఏదో ఒక సందర్భంలో కోపం రాకమానదు. చాలామంది జనాలు "కోపం రాకూడదు.. కోపం వచ్చే సమయంలో నిగ్రహం పాటించాలి.. నిజానికి పక్కవారు విసిగించిన సమయంలో ఎక్కువ శాంతంగా ఉండాలి" అంటూ జఫ్ఫా ఫిలాసఫీ చెప్తుంటారు. అలా వారు మాంఛి ఫ్లోలో ప్రవచనం సమయంలోవారి నెత్తిపై వరసగా నాలుగు మొట్టికాయలు గట్టిగా వేస్తే చాలు. ఆ శాంతం.... సహనం.. ఎంత మాత్రమో బయట పడుతుంది... వారి నిగ్రహ శక్తి తేటతెల్లమవుతుంది!

సమంతా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అప్పుడప్పుడు తిరుమల వెళ్తూ ఉంటుంది. ఇటీవల ఒకసారి అలానే తిరుమలకు వెళ్ళింది. అక్కడ మెట్లదారిపై నడుస్తూ వెళ్తున్న సమయంలో కొందరు అభిమానులు సమంతాతో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. అభిమానులు కావడంతో సమంతా చాలామందితో ఫోటోలు దిగింది. సమంతాను రిక్వెస్ట్ చేసి ఫోటోలు తీసుకునేవారు కాకుండా పర్మిషన్ తీసుకోకుండా చాలామంది ఫోటోలు.. వీడియోలు తీస్తూ ఉండడంతో సమంతా అసహనానికి గురైంది. అయితే ఎక్కడకు వెళ్ళినా ఇదే వరస కావడంతో సమంతాకు సామ్ కు చిరాకొచ్చింది. దీంతో కాస్త విసుగ్గా "ఫొటోలు తీయకండి" అంటూ వార్నింగ్ ఇచ్చింది. సమంతా ఇలా వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సమంతా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి సినిమా "కాతువాకుల రెండు కాదల్' లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమాలో నయనతార మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో పాటుగా అశ్విన్ శరవణన్ రూపొందించనున్న మరో సినిమాకు పచ్చజెండా ఊపిందని సమాచారం.