Begin typing your search above and press return to search.

ఆయుష్మాన్ సినిమాతో సమంత బాలీవుడ్ ఎంట్రీ..?

By:  Tupaki Desk   |   6 July 2022 3:56 AM GMT
ఆయుష్మాన్ సినిమాతో సమంత బాలీవుడ్ ఎంట్రీ..?
X
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంతా రూత్ ప్రభు ఒకరు. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో ఊ అంటావా మావా అంటూ ఐటమ్ సాంగ్ తో నార్త్ లో ఊపేసిన సామ్.. ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

దర్శక ద్వయం రాజ్‌ & డీకే తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సమంత.. తన పెర్ఫార్మన్స్ తో హిందీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అగ్ర కథానాయిక.. రెండు హిందీ సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ తాప్సీ పన్నూ నిర్మించే ఓ హిందీ ప్రాజెక్ట్ లో సామ్ నటించనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్టుగా తాప్సీ ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఈ చిత్రంతోనే సమంత బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టనుందని అందరూ అనుకున్నారు.

అయితే తాజా నివేదిక ప్రకారం, సమంతా ఇప్పటికే తన డెబ్యూ హిందీ ప్రాజెక్ట్ కు సంతకం చేసింది. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించాడని రెడీ అయిందని తెలుస్తోంది. దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ బ్యాంక్రోల్ చేయనున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ తో సామ్ హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.

2023 చివరలో ఈ ప్రాజెక్ట్ ను విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని తరువాతే తాప్సీ ప్రొడక్షన్ లో సమంత సినిమా ఉండే అవకాశం ఉందని టాక్. ఇదే నిజమైతే ఆయుష్మాన్ ఖురానా వంటి హీరోతో చేస్తున్న సినిమా కావడంతో.. ఆమెకు ఇది సరైన బాలీవుడ్ లాంచ్ అవుతుందని అనుకోవచ్చు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. 'సిటాడెల్‌' అనే హాలీవుడ్ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ సిరీస్ కు ఇది ఇండియన్ వెర్షన్. రాజ్‌ & డీకే ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్ - సామ్ ఇద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారు. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

అంటే బ్యాక్ టూ బ్యాక్ వరుణ్ ధావన్ - ఆయుష్మాన్ ఖురానా వంటి ఇద్దరు బాలీవుడ్ యంగ్ హీరోలతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతోందన్నమాట. అంతేకాదు గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న 'శాకుంతలం' సినిమా మరియు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'యశోద' మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతాయి

ఇప్పటి వరకు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత.. ఇప్పుడు నార్త్ లో సత్తా చాటడానికి పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయింది. విజయ్ - శివ కార్తికేయన్ లతో సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్. ఇక 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సమంత చేతిలో ఉంది.