Begin typing your search above and press return to search.

మోసం చేశాడని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పై సినీ నటి సుధ ఫిర్యాదు..!

By:  Tupaki Desk   |   27 May 2020 10:00 AM GMT
మోసం చేశాడని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పై సినీ నటి సుధ ఫిర్యాదు..!
X
సినీ ఇండస్ట్రీలో శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్న చోటా కె నాయుడు బాటలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అడుగుపెట్టిన శ్యామ్ కె.నాయుడు స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఒసేయ్ రాములమ్మ' 'నువ్వు వస్తావని' 'రాజా' 'శీను' 'ఇడియట్' 'నేనింతే' 'శివమణి' 'బుజ్జిగాడు' 'ఏక్ నిరంజన్' 'చిరుత' 'దేశముదురు' 'మాస్' 'సూపర్' 'పోకిరి' 'బిజినెస్ మెన్' 'కెమెరామెన్ గంగతో రాంబాబు' 'బాడీగార్డ్' 'టెంపర్' 'డిక్టేటర్' సినిమాలతో పాటు 'ఆఘాజ్' అనే హిందీ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందించారు శ్యామ్. కాగా శ్యామ్ కె.నాయుడు పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని సినీ నటి శ్రీ సుధా కేసు ఫైల్ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం.

కాగా శ్రీ సుధా రెడ్డి విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 'అ ఆ' 'ఈడో రకం వాడో రకం' తదితర చిత్రాలలో నటించింది. ప్రొఫెషనల్ గా డాక్టర్ అయిన శ్రీ సుధా యాక్టింగ్ మీద మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే సినిమా ఆఫర్స్ సంపాదించింది సుధ. ఇప్పుడు తాజాగా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచింది. ఈ కేసు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.