Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌ లో సాయి పల్లవి పప్పులు ఉడకడం లేదు!

By:  Tupaki Desk   |   14 Aug 2020 8:50 AM GMT
కోలీవుడ్‌ లో సాయి పల్లవి పప్పులు ఉడకడం లేదు!
X
తమిళనాడుకు చెందిన సాయి పల్లవి మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత టాలీవుడ్‌ లో ఫిదా చేసి ప్రస్తుతం కోలీవుడ్‌ లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు కోలీవుడ్‌ లో చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా విఫలం అవుతున్నాయి. తెలుగులో దక్కినంత స్టార్‌ డం క్రేజ్‌ ఈ అమ్మడికి అక్కడ దక్కడం లేదు అని చెప్పక తప్పదు. తమిళంలో ఈమె చేసిన మారి 2 మరియు ఎన్జీకే చిత్రాలు నిరాశ పర్చాయి. ముఖ్యంగా ఆరెండు సినిమాల్లో ఈమె పాత్రలు ట్రోల్స్‌ ఎదుర్కొన్నాయి.

మారి 2 మరియు ఎన్జీకే చిత్రాల్లో ఈమె ఓవర్‌ యాక్షన్‌ చేసింది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో అక్కడి ప్రేక్షకుల్లో ఈమెపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడిపోయింది. అందుకే అక్కడ కొత్తగా ఆఫర్లు రావడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులోనే రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌ లో మాత్రం సినిమాలు ఏమీ చేయడం లేదు. సొంత భాషలో హీరోయిన్‌ గా రాణించాలని ఈమె అనుకుంటుందట. కాని మొదట్లో ఎంపిక చేసుకున్న పాత్రలు ప్రేక్షకులను నిరాశ పర్చడంతో ఇప్పుడు ఒక మంచి పాత్రతో అక్కడ అదృష్టాన్ని పరీక్షంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగులో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ గా మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ స్టార్‌ గా దూసుకు పోతుంది. మరో వైపు ఈమెకు మలయాళం నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాని వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగు మరియు తమిళ సినిమాలపై ఈమె ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. తమిళంలో ఈమె ఫిదా చేసేది ఎప్పుడో మరి..!