Begin typing your search above and press return to search.

ఆ నాలుగుతోనే సరి.. ఇకపై నో అంటున్న మెగాహీరో!

By:  Tupaki Desk   |   9 April 2020 5:10 AM GMT
ఆ నాలుగుతోనే సరి.. ఇకపై నో అంటున్న మెగాహీరో!
X
మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్స్‌ మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ చూస్తూ ముందుకు సాగుతున్నాడు. వరుసగా ఆరు ఫ్లాప్స్‌ తర్వాత చిత్ర లహరి ఇంకా ప్రతి రోజు పండుగే చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫ్లాప్స్‌ కు బ్రేక్‌ వేసిన సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సోబెటర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ కరోనా ఉపద్రవం ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తేజ్‌ ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయిన తేజ్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మామయ్య రీమిక్స్‌ సాంగ్స్‌ గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకు నాలుగు చిరు పాటలను తన సినిమాల్లో రీమిక్స్‌ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ ఇకపై రీమిక్స్‌ జోలికి వెళ్లనంటూ ప్రకటించాడు. నాలుగు పాటల్లో రెండు పాటలకు మంచి స్పందన వచ్చినా మరో రెండు పాటలను చెడగొట్టారు అంటూ విమర్శలను నెత్తిన మోయాల్సి వచ్చింది.

రీమిక్స్‌ సాంగ్స్‌ కు మిశ్రమ స్పందన రావడంతో పాటు ఆ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటున్న కారణంగా సాయి ధరమ్‌ తేజ్‌ వాటికి స్వస్థి పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన నాలుగు రీమిక్స్‌ లతోనే సరి.. ఇకపై రీమిక్స్‌ చేద్దామని ఎవరైనా దర్శకుడు అడిగినా కూడా నో అంటానన్నట్లుగా తేజ్‌ చెప్పుకొచ్చాడు. సోలో బ్రతుకే సోబెటర్‌ చిత్రం తర్వాత దేవ కట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్‌ మూవీలో ఈ మెగా హీరో నటించబోతున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అది రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఇదే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.