Begin typing your search above and press return to search.

సాయి తేజ్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న

By:  Tupaki Desk   |   23 Sep 2021 3:30 AM GMT
సాయి తేజ్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న
X
ఇటీవ‌ల గ‌చ్చిబౌలీ స‌మీపంలో రోప్ వేలో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురై అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. రోడ్డుపై ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంప‌నీ బిల్డింగ్ ప‌నుల కార‌ణంగా ఇసుక వేయ‌డంతో హీరో సాయ‌ధ‌ర‌మ్ తేజ్ న‌డుపుతున్న బైక్ స్కిడ్ కావ‌డం.. ఆయ‌న దాని కార‌ణంగానే ప్ర‌మాదానికి గురై గాయాల పాలు కావ‌డం తెలిసిందే. మెగాభిమానుల‌తో పాటు యావ‌త్ ప్రేక్ష‌కుల‌ని సినీ వ‌ర్గాల‌ని ఈ సంఘ‌ట‌న షాక్ కు గురిచేసింది.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే సాయిని కొంత మంది స‌రైన స‌మ‌యంలో హాస్పిట‌ల్ కి త‌ర‌లించ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అపోలో హాస్పిట‌ల్లో గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నిదానంగా కోలుకుంటున్నారు. భుజంపై స‌ర్జ‌రీ కావ‌డంతో ఆయ‌న ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. ఇదిలా వుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై తాజాగా డాక్ట‌ర్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త కొన్ని రోజులుగా మాట్లాడ‌ని ఆయ‌న ప్ర‌స్తుతం క‌ళ్లు తెరిచి చూస్తున్నార‌ని.. మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆరోగ్యం క్ర‌మంగా కుదుటప‌డుతోంద‌ని వెంటిలేట‌ర్‌.. ఆక్సిజ‌న్ స‌పోర్ట్ ను తీసేసిన‌ట్టు డాక్ట‌ర్లు తాజాగా వెల్ల‌డించారు.

కొన్ని రోజుల క్రిత‌మే సాయి ధ‌ర‌మ్ తేజ్ ని ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి మార్చారు. సొంతంగా శ్వాస తీసుకుంటూ అంద‌రితో సాయి మాట్లాడుతున్నార‌ని డాక్ట‌ర్లు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. మ‌రో రెండు .. మూడు రోజుల్లో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవ‌కాశం వుంద‌ని తెలిసిందే. ఇదిలా వుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన `రిప‌బ్లిక్‌` అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లేజు కోరిక మేర‌కే ఈ మూవీని అక్టోబ‌ర్ 1న గాంధీ జ‌యంతికి ఒక్క రోజు ముందు రిలీజ్ చేస్తున్నామంటూ బుధ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తూ చిరంజీవి ప్ర‌క‌టించారు.