Begin typing your search above and press return to search.
స్టార్ హీరో కోసం నాగ చైతన్య త్యాగం
By: Tupaki Desk | 17 Sep 2021 12:30 AM GMTసూపర్స్టార్ మహేష్ బాబు కోసం యంగ్ హీరో నాగచైతన్య త్యాగం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `పరశురామ్ నా వద్దకు వచ్చి స్క్రిప్ట్ చెప్పాడు. నేను దాన్ని ఓకే చేసాను కానీ, నా వద్దకు రాకముందే, అతను మహేష్ బాబుకు మరో స్క్రిప్ట్ వినిపించాడు. అది అప్పటికి ఫైనల్ కాలేదు. అంతే కాకుండా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయం నెలకొంది. దాంతో పరశురామ్, నేను కలిసి సినిమా మొదలుపెట్టాలనుకున్నాం. ఇంతలో మళ్లీ మహేష్ ప్రాజెక్ట్ ముందు మొదలవుతుందని చెప్పాడు. దాంతో నా ప్రాజెక్ట్ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది`అని నాగ చైతన్య వెల్లడించాడు.
పరశురాం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ముందు డైరెక్టర్ పరశురామ్ తో నాగ చైతన్యతో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది మహేష్ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మహేష్ కోసం నాగచైతన్య తన సినిమాని త్యాగం చేయాల్సి వచ్చింది.
నాగ చైతన్య `లవ్ స్టోరీ` విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీతో పాటు `మనం` ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో ఇప్పటికే `థ్యాంక్యూ` మూవీని పూర్తి చేశాడు. దీని తరువాత తన తండ్రి నాగ్ తో కలిసి `బంగార్రాజు`లో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాతే పరశురాం చిత్రం పట్టాలెక్కుతుందట.
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `పరశురామ్ నా వద్దకు వచ్చి స్క్రిప్ట్ చెప్పాడు. నేను దాన్ని ఓకే చేసాను కానీ, నా వద్దకు రాకముందే, అతను మహేష్ బాబుకు మరో స్క్రిప్ట్ వినిపించాడు. అది అప్పటికి ఫైనల్ కాలేదు. అంతే కాకుండా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయం నెలకొంది. దాంతో పరశురామ్, నేను కలిసి సినిమా మొదలుపెట్టాలనుకున్నాం. ఇంతలో మళ్లీ మహేష్ ప్రాజెక్ట్ ముందు మొదలవుతుందని చెప్పాడు. దాంతో నా ప్రాజెక్ట్ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది`అని నాగ చైతన్య వెల్లడించాడు.
పరశురాం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ముందు డైరెక్టర్ పరశురామ్ తో నాగ చైతన్యతో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది మహేష్ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో మహేష్ కోసం నాగచైతన్య తన సినిమాని త్యాగం చేయాల్సి వచ్చింది.
నాగ చైతన్య `లవ్ స్టోరీ` విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీతో పాటు `మనం` ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో ఇప్పటికే `థ్యాంక్యూ` మూవీని పూర్తి చేశాడు. దీని తరువాత తన తండ్రి నాగ్ తో కలిసి `బంగార్రాజు`లో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాతే పరశురాం చిత్రం పట్టాలెక్కుతుందట.