Begin typing your search above and press return to search.

#SSMB28 అక్క‌డ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ?

By:  Tupaki Desk   |   5 Dec 2022 2:30 PM GMT
#SSMB28 అక్క‌డ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో క‌లిసి త‌న 28వ ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్లింది. హారిక అండ్ హాసిని క్రియేస‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేస్తూ సెప్టెంబ‌ర్ 12న అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించారు.

ఆ త‌రువాత టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చేసింది. అక్క‌డ మహేష్ పాల్గొన‌గా ఫైట్ మాస్ట‌ర్స్ అన్బు అరివుల నేతృత్వంలో భారీ యాక్ష‌న్ ఎపిపోడ్ ని ప్లాన్ చేసి విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. త‌రువాత షెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వ‌డం అదే స‌మ‌యంలో మ‌హేష్ మ‌ద‌ర్ చ‌నిపోవ‌డం తెలిసిందే. ఆ త‌రువాత త‌న త‌ల్లి మ‌ర‌ణం నుంచి తేరుకుంటున్న మ‌హేష్ తో త్వ‌ర‌లోనే తాజా షెడ్యూల్ ని ప్రారంభించాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్న క్ర‌మంలో మ‌రో షాక్ త‌గిలింది. ఈ సారి సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి చెందారు.

దీంతో ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ ఆగిపోయింది. ఫైన‌ల్ గా త్రివిక్ర‌మ్ క‌థ‌ని మార్చేసి ఫ్రెష్ గా మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేసుకున్నారు. డిసెంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు `మౌంటెన్ డ్యూ` క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్క‌డ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. రెండు రోజుల షూటింగ్ తో యాడ్ షూట్ ఫినిష్ అవుతుంది. దీంతో అక్క‌డే మ్యూజిక్ సిట్టింగ్స్ వేయాల‌ని టీమ్ ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది.

దీంతో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ దుబాయ్ వెళ్లార‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ చేస్తున్న మౌంటెన్ డ్యూ` క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ పూర్త‌యిపోవ‌డంతో అక్క‌డే ఓ స్టార్ హోటల్ లో త్రివిక్ర‌మ్, మ‌హేష్‌తో క‌లిసి త‌మ‌న్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం దర్శకుడు త్రివిక్రమ్... నిర్మాత నాగ వంశీ.. మ్యూజిక్ డైరెక్టర్.. ముంబై నుంచి దుబాయ్ కి వెళ్లార‌ట‌.

`అల వైకుంఠ‌పుర‌ములో` త‌రువాత త్రివిక్ర‌మ్ , త‌మ‌న్ ల క‌ల‌యిక‌లో రానున్న ఆడియో కాబ‌ట్టి మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.