Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ వైపు బాలీవుడ్ బాద్షా..?

By:  Tupaki Desk   |   5 Jun 2021 1:30 AM GMT
యంగ్ డైరెక్టర్ వైపు బాలీవుడ్ బాద్షా..?
X
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. చివరిసారి తెరమీద కనిపించిన సినిమా జీరో. ఆ విడుదలై దాదాపు రెండేళ్లు అయిపోయింది. కానీ ఇంతవరకు షారుఖ్ నుండి తన కొత్త సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. నిజానికి జీరో సినిమా పై షారుఖ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించాడు. కానీ సినిమా మాత్రం షారుఖ్ ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఆ సినిమా మిగిల్చిన నష్టం నుండి కోలుకోవడానికే షారుఖ్ ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడేమో.. అని అనుకున్నారంతా. నిజంగానే షారుఖ్ అదే కారణంతో బయటికి రాట్లేడా అని సందేహాలు వ్యక్తమయ్యాయి.

కానీ మొత్తానికి షారుఖ్ కొత్త సినిమాతో బయటికి వచ్చాడు. షారుఖ్ కెరీర్ పరంగా గతంలో కూడా ఫ్లాపులున్నాయి కానీ.. జీరో మాత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. గడిచిన రెండేళ్లుగా షారుఖ్ తదుపరి సినిమా గురించి రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా ఓకే చేసాడని.. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో షారుఖ్ సినిమా ఉంటుందని మీడియాలో ప్రచారాలు భారీగానే జరిగాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లని ఎందులోనూ నిజం లేదని మధ్యలో తెల్చేశాడు. ఆఖరికి ఆ రెండు కాదని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దశకత్వంలో పఠాన్ సినిమా ఓకే చేసాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే తాజాగా షారుఖ్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. షారుఖ్ ఓ సినిమా మాత్రం ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు షారుఖ్ తన రాబోయే సినిమా గురించి డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో పాటు అట్లీతో కూడా చర్చలు జరిపాడట. అయితే ఇంకా అధికారిక న్యూస్ బయటికి రాలేదుగాని షారుఖ్ అట్లీతో సినిమా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు బాలీవుడ్ వర్గాలలో హాట్ న్యూస్ హల్చల్ చేస్తోంది. రెండేళ్లుగా అట్లీ షారుఖ్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అట్లీ సినిమా ఓకే అయిందని ఈ ఏడాది ఆగష్టు నుండి పట్టాలెక్కానుందని వార్త ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. చూడాలి మరి త్వరలో అధికారిక ప్రకటన రానుందేమో!