Begin typing your search above and press return to search.

మ‌హేష్ నే మ‌ళ్లీ మ‌ళ్లీ లాగుతారెందుకు?

By:  Tupaki Desk   |   28 Jan 2022 3:30 AM GMT
మ‌హేష్ నే మ‌ళ్లీ మ‌ళ్లీ లాగుతారెందుకు?
X
అల్లు రామాయణం ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారుతోంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ తెర‌కెక్కించే ఈ చిత్రంలో మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టిస్తాడ‌ని హృతిక్ రావ‌ణాసురుడిగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.
ఈ సినిమాలో రాముడి పాత్రను చేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించినట్లు ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు మ‌ళ్లీ అవే వార్త‌లు రిపీట‌వుతున్నా అల్లు కాంపౌండ్ ప్ర‌క‌టించ‌లేదు. మ‌హేష్ తో చర్చిస్తున్నా అత‌డు ఓకే చెప్ప‌లేద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

అయితే మ‌హేష్ త‌దుప‌రి రాజ‌మౌళి కోసం మూడేళ్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత అత‌డు మ‌హేష్ తోనే సెట్స్ పైకి వెళ‌తారు. మ‌హేష్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో సినిమాని పూర్తి చేసే ప‌నిలో ప‌డుతున్నారు. అయితే ఈ సినిమాల‌తో పాటు రామాయ‌ణం లోనూ న‌టిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇది నిజ‌మేనా? అంటే.. కేవ‌లం ప్ర‌చారహంగామా మాత్ర‌మేన‌ని గుస‌గుస వినిపిస్తోంది. మ‌హేష్ నటించిన `స‌ర్కార్ వారి పాట` విడుద‌ల కావాల్సి ఉంది.

కొత్త‌మ్మాయికి ఛాన్స్

మ‌హేష్ ఇక‌ పూర్తిగా త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ కే అంకితం కానున్నారు. ఇందులో మ‌హేష్ కి జోడీగా పూజాహెగ్డేని లాక్ చేసారు. తాజాగా సినిమాలో మ‌హేష్ మ‌ర‌ద‌లి పాత్ర కూడా కీల‌కం కానుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆ పాత్ర కోసం సంయుక్త మీన‌న్ ని ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భామ ప్ర‌స్తుతం `భీమ్లా నాయ‌క్` లో రానాకి జోడీగా న‌టిస్తోంది. క‌థానాయిక‌ల్ని త్రివిక్ర‌మ్ ఎంపిక చేస్తున్నారు.