Begin typing your search above and press return to search.

200 కోట్ల దోపిడీ కేసు: జాక్వెలిన్ కు బెయిల్.. కానీ ట్విస్ట్ ఇదే?

By:  Tupaki Desk   |   26 Sep 2022 8:30 AM GMT
200 కోట్ల దోపిడీ కేసు: జాక్వెలిన్ కు బెయిల్.. కానీ ట్విస్ట్ ఇదే?
X
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆర్థిక నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్ తో కలిసి కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులు పెట్టి ట్విస్ట్ ఇచ్చింది. జాక్వెలిన్ కు 50వేల రూపాయిల బాండ్ పేపర్ తో కూడిన తాత్కాలిక బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

ఈ కేసునుంచి బయటపడేందుకు జాక్వెలిన్ పెద్ద పెద్ద లాయర్లతో కలిసి తీవ్రంగా ప్రయత్నించింది. సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కోర్టుకు హాజరైంది. పాటియాల హౌస్ కోర్టు ఈ కేసులో జాక్వెలిన్ కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది.

రాన్ బాక్సీ ప్రమోటర్లకు బెయిల్ ఇప్పిస్తానంటూ సుఖేష్ గతంలో రూ.200 కోట్లు వారి వద్దనుంచి తీసుకొని మోసం చేశాడు. మాజీ సీఎం కొడుకును అంటూ, పీఎంవో అధికారిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నమ్మించి ఈ పనిచేశారు. సుఖేష్ తో జాక్వెలిన్ కు ఉన్న ఎఫైర్ కారణంగా ఆమె ఈ కేసులో బుక్కైంది. ఇతడితో సన్నిహిత సంబంధాల మూలంగా జాక్వెలిన్ కూడా కేసులో ఇరుక్కుంది. ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది.

సుకేష్ కుంభకోణంలో జాక్వెలైన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. జాక్వెలిన్ స్టైలిష్ట్ అయిన 'లేపాక్షి ఎల్లవాడి'ని 8 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా సుఖేష్, జాక్వెలిన్ లు సహజీవనం చేశారని లేపాక్షి తెలిపినట్టు సమాచారం. తనకు సుకేష్ పలు మార్లు ఫోన్ చేసి జాక్వెలిన్ ఎలాంటి వస్తువులు, దుస్తులు అంటే ఇష్టమని తెలుసుకునేవాడని.. ఆమెను మచ్చిక చేసుకునేందుకు భారీగా బహుమతులు ఇచ్చేవాడని లేపాక్షి తెలిపారు. జాక్వెలిన్ కోసం 3 కోట్ల రూపాయిలు ఇచ్చి బ్రాండెడ్ దుస్తులు కొనమని చెప్పాడని.. తన బ్యాంక్ అకౌంట్ కు సుకేష్ డబ్బులు ట్రాన్స్ పర్ చేశాడని తెలిపాడు. ఆ డబ్బుతో జాక్వెలిన్ కోసం దుస్తులు, బహుమతులు కొన్నానని.. సుఖేష్ అరెస్ట్ తర్వాత అతడితో జాక్వెలిన్ తెగదెంపులు చేసుకున్నదని లేపాక్షి చెప్పారు.

జాక్వెలైన్ కు భారీగా ధనం ఇచ్చి ముంబైలోని సముద్ర తీరానికి అభిముఖంగా ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కానుకగా సుకేష్ ఇచ్చాడని ఈడీ విచారణలో తేలింది.. సుకేష్ తో ముద్దులు మురిపాలు అన్నీ ఆ అపార్ట్ మెంట్ లోనే సాగాయని తేలింది. రూ.10 కోట్ల మేర లబ్ధి పొందినట్టు ఈడీ గుర్తించింది. 7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. సుకేష్ ఏకంగా జాక్వెలిన్ కు ఖరీదైన బహుమతులు కానుకగా ఇచ్చినట్టు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్ లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్ కు సుకేష్ ఇచ్చినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆధారాలు బలంగా ఉండడంతో జాక్వలైన్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో జాక్వలైన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

జాక్వెలిన్ ను సుకేష్ చెన్నైలో దాదాపు 4 సార్లు కలిశాడని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అతడిని కలిసేందుకు జాక్వెలిన్ ప్రైవేట్ జెట్ ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.