Begin typing your search above and press return to search.

రాకింగ్ స్టార్ రేట్ పెంచేసాడా..?

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:30 AM GMT
రాకింగ్ స్టార్ రేట్ పెంచేసాడా..?
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ 'కేజీఎఫ్' సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికి కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విడుదలైన టీజర్ ఎలాంటి సంచనాలు నమోదు చేసిందో తెలిసిందే. హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫస్ట్ పార్ట్ కి మించి భారీగా చాప్టర్-2 ని రూపొందించినట్లు అర్థం అవుతోంది. ఇందుకోసం 150 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం హీరో యష్ కూడా రెమ్యూనరేషన్ భారీగానే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యష్.. 'కేజీఎఫ్ 2' కోసం రేటు పెంచేసాడట. చాప్టర్ 1 కు 11 కోట్లు పారితోషకం తీసుకున్న యష్.. ఇప్పుడు చాప్టర్ 2 కోసం ఏకంగా 30 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే 'కేజీఎఫ్ 2' బిజినెస్ దాదాపు 250 కోట్లకు పైమాటే అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, 'కేజీఎఫ్ 2'లో సంజయ్ దత్ - రవీనా టాండన్ - ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి రవి బాస్రుర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.