Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన రాక్ స్టార్..?

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:42 AM GMT
బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన రాక్ స్టార్..?
X
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఎన్నో చార్ట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఇటీవల కాలంలో కాస్త స్పీడ్ తగ్గించారు. అయితే ఇప్పుడు 'పుష్ప: ది రైజ్' సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా కోసం ఐదు భాషల్లో డీఎస్పీ కంపోజ్ చేసిన సాంగ్స్.. సంగీత ప్రియులకు విశేషంగా అలరించాయి.

'పుష్ప' పార్ట్-1 విజయంలో అల్లు అర్జున్ - సుకుమార్ లతో పాటుగా దేవిశ్రీ కి భాగం ఉందని అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలోని అన్ని పాటలూ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అంతేకాదు టాప్-100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి రాక్ స్టార్ డీఎస్పీ మీద పడినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీప్రసాద్ గతంలో కంపోజ్ చేసిన తెలుగు ట్యూన్స్ హిందీలోకి రీమేక్ చేయబడిన సంగతి తెలిసిందే. 'ఆ అంటే అమలాపురం' 'డింక చికా డింక చికా' 'సీటీమార్' వంటి పాటలు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించాయి. అయితే డీఎస్పీ ఇంతవరకు బాలీవుడ్ లో కంప్లీట్ ఆల్బమ్ చేయలేదు. అవకాశం వస్తే హిందీ సినిమా చేయాలని స్టార్ కంపోజర్ వేచి చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇటీవల దేవిశ్రీప్రసాద్ ను కలిసినట్లు నివేదికలు వెల్లడించాయి. టీ సిరీస్ వారు నిర్మించే ఓ చిత్రానికి డీఎస్పీ మ్యూజిక్ అందించేలా ఒప్పందం కురిదినట్లు తెలుస్తోంది. భూషణ్ కుమార్ అంటే భారీ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పుడు దేవి వర్క్ చేయబోయేది కూడా పెద్ద ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

కాగా, దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' - రవితేజ 'ఖిలాడి' - రామ్ పోతినేని 'ది వారియర్' - చిరంజీవి 'Chiru154' - అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' - వెంకటేష్ & వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 3' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఆల్బమ్స్ తో డీఎస్పీ మళ్ళీ టాప్ పొజిషన్ కు చేరుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.