Begin typing your search above and press return to search.

నిన్ను కోల్పోయి నెలయింది.. ప్రశాంతంగా ఉండు సుశీ: రియా చక్రవర్తి

By:  Tupaki Desk   |   14 July 2020 7:50 AM GMT
నిన్ను కోల్పోయి నెలయింది.. ప్రశాంతంగా ఉండు సుశీ: రియా చక్రవర్తి
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా అందరిని కలిచి వేసింది. సోషల్ మీడియాలో సుశాంత్‌ అంకిత లోఖండేతో పాటు కృతి సనన్.. రియా చక్రవర్తిలతో ప్రేమాయణం నడిపాడని వార్తలు ముమ్మరం అయ్యాయి. వీరిలో అంకితతోనే ఎక్కువ కాలం ప్రేమలో ఉన్నాడు సుశాంత్. టీవీ సీరియల్ పవిత్ర రిష్తా షూటింగ్ టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే చాలాకాలం ప్రేమ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత సుశాంత్ జీవితంలోకి రియా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం పై అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ సంతాపం వ్యక్తం చేశారు.

అలా ఎందుకు చేశాడా.. అని ఇంకా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ సుశాంత్ మ‌ర‌ణంతో ఇండస్ట్రీలో బంధుప్రీతి పై ఇంకా సోష‌ల్ మీడియాలో చ‌ర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక మొన్నటి వరకు సుశాంత్ గురించి నోరువిప్పని రియా తాజాగా సుశాంత్ మరణించి నేటికీ ఒక నెల ముగియడంతో సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో.. ”నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నా మనసులో ఎక్కడ లేని శూన్యం నిండింది. నాకు నువ్వు నిజమైన ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు. ఓ చిన్న మ్యాథమేటికల్ ఈక్వెషన్‌ ద్వారా మన జీవితాన్ని అర్థం చేసుకునే విధానాన్ని నువ్వే నాకు నేర్పావు. నేను నీ దగ్గర రోజు నేర్చుకుంటా అని ప్రామిస్ చేశా.

నువ్వు లేని లోటును నేను మాటల్లో వివరించలేను. ప్రస్తుతం నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నావని భావిస్తున్నాను. చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీ ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తకు సాదరంగా స్వాగతం పలికి ఉంటాయి. నిన్ను మళ్లీ నా దగ్గరకు పంపాలని కోరుకుంటాను. నీ వ్యక్తిత్వం ఎంతో అందమైనది. నీ మార్గంలో అద్భుతమైన ప్రపంచం చూసావు. మన మధ్య ప్రేమను తెలిపేందుకు నాకు మాటలు చాలడం లేదు. ఎన్నోసార్లు నువ్వు మన ప్రేమను గుర్తు చేసావు. ప్రశాంతంగా ఉండు సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ రియా ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం రియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.