Begin typing your search above and press return to search.

సుధీర్ వర్మ 'మిడ్ నైట్ రన్నర్స్' రీమేక్ షూట్ లో రెజీనా - నివేదా..!

By:  Tupaki Desk   |   26 July 2021 8:13 AM GMT
సుధీర్ వర్మ మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ షూట్ లో రెజీనా - నివేదా..!
X
'స్వామిరారా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ.. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ వర్మ.. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ కొరియన్ యాక్షన్ కామెడీ రీమేక్ సినిమాతో రాబోతున్నారు.

ఇది దక్షిణ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. దీనికి ''శాకినీ - ఢాకినీ'' అనే పేరు ప్రచారంలో ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ సంస్థకు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్ బాబు - సునీత తాటి- హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరు కలిసి నిర్మించిన 'ఓ బేబీ' చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

'మిడ్ నైట్ రన్నర్స్' రీమేక్ చిత్రంలో రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రెజీనా - నివేదా ఇద్దరూ తొలిసారిగా స్టంట్స్ చేయబోతున్నారు. 'ఓ బేబీ' ఒరిజినల్ వెర్షన్ 'మిస్ గ్రానీ' తరహాలోనే ''మిడ్నైట్ రన్నర్స్'' కథకి కూడా యూనివర్సల్ అప్పీల్ ఉందని.. తెలుగు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా మార్చిలో ఫస్ట్ షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మైకీ మెక్‌క్లరీ సంగీతం సమకూరుస్తున్నారు. విప్లావ్ నిషాడమ్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.