Begin typing your search above and press return to search.

ఆ రెండు బాకీలు తీర్చేందుకే

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:30 PM GMT
ఆ రెండు బాకీలు తీర్చేందుకే
X
రెండేళ్ళ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేసాడు పవన్ కళ్యాణ్... ఎట్టకేలకు పింక్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. నిన్న మధ్యాహ్నం వరకూ పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీసారు. అయితే నిన్న సడెన్ గా షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక సినిమాలకు స్వస్తి పలుకుతాడేమో అనుకున్న సమయంలో ఫ్యాన్స్ కి సైలెంట్ గా గుడ్ న్యూస్ ఇచ్చాడు.

అయితే ఇదే స్పీడ్ తో మరో సినిమా స్టార్ట్ చేసి మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు పవన్. అవును ఇదే నెలలో మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం డైరెక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ నెక్స్ట్ క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా 27 నుండి సెట్స్ పైకి రానుంది.

ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ ఉన్నపళంగా ఈ రెండు సినిమాలు చేయడానికి రీజన్ ఇద్దరు నిర్మాతలు. అవును ఏ.ఎం.రత్నం నుండి ఎప్పుడో ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. ఆ బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసాడు. ఇక తన బ్యానర్ లో ఒక సినిమా చేయమని ఎప్పటి నుండో పట్టుబడుతున్నాడు దిల్ రాజు. అడ్వాన్స్ ఏమి తీసుకోలేదు కానీ ఎప్పటికైనా నీతో ఒక సినిమా చేస్తా అని అప్పట్లో రాజు కి మాటిచ్చాడు పవన్. అందుకే రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ , ఏ,ఎం.రత్నం బ్యానర్ లో క్రిష్ సినిమా చేసి వారిద్దరి బాకీ తీర్చబోతున్నాడు.