Begin typing your search above and press return to search.

రాజమౌళి శిష్యుడి రీ ఎంట్రీ?

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:00 PM GMT
రాజమౌళి శిష్యుడి రీ ఎంట్రీ?
X
రాజమౌళి శిష్యుడు అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి త్రికోటి. ఇతను దర్శకుడిగా మొదటి సినిమాని నాగ శౌర్యతో చేసాడు. దిక్కులు చూడకు రామయ్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించే స్టొరీ లైన్ తో ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్, నాగ శౌర్య తండ్రికొడుకులుగా నటించారు. 2014లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మించారు. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళి టీమ్ నుంచి ఈ సినిమా వచ్చింది అని చెప్పాలి. ఇక తరువాత జువ్వా అనే టైటిల్ తో ఒక సినిమాని త్రికోటి మరో నాలుగేళ్ల తర్వాత చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో మళ్ళీ రాజమౌళి అసోసియేట్ గా త్రికోటి జక్కన్న టీమ్ లో చేరిపోయాడు. అయితే మరల ఇప్పుడు మూడో సినిమా చేయడానికి త్రికోటి సిద్ధం అవుతున్నాడు.

మగధీర సినిమాలో విలన్ గా నటించిన దేవ్ గిల్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. తను నిర్మాతగా మొదటి సినిమాని ప్లాన్ త్రికోటి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే దేవ్ గిల్ కూడా ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.

టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీసింహ అనుకున్న స్థాయిలో హీరోగా సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. మరి రాజమౌళి శిష్యుడు త్రికోటి అయిన అతనికి మంచి హిట్ బొమ్మ ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాని రాజమౌళి టీమ్ నుంచి అందరూ వర్క్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. దేవ్ గిల్ కూడా రాజమౌళి సపోర్ట్ తోనే నిర్మాతగా అడుగులు వేయబోతున్నట్లు టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.