Begin typing your search above and press return to search.
రవితేజ రావణాసుర కోసం ఉక్రెయిన్ టీమ్.. టాలీవుడ్ లో తొలిసారిగా..
By: Tupaki Desk | 29 Jan 2023 6:00 PM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం రావణాసుర. హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఐక రవితేజ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ చిన్న టీజర్ను విడుదల చేసింది టీమ్. ఆ టీజర్ మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది.
ఇందులో మర్డర్స్ చేసినట్టు, అమ్మాయిలని బలవంతం పెట్టినట్టు కొన్ని షాట్స్ చూపించారు. ఆ తర్వాత ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో పాటు లాయర్ గా మరో పాత్ర కూడా పోషిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
అయితే తాజాగా మరో కొత్త విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఏంటంటే ఈ సినిమాలో ఉక్రెయిన్ బేస్డ్ శాంతి పీపుల్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్ ఓ స్పెషల్ పాట పాడింది. వేద మంత్రాలతో ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఉండేలాగా ఈ పాటను రూపొందించడం విశేషం. మరో విశేషమేమిటంటే.. శాంతి పీపుల్ బ్యాండ్ టాలీవుడ్ మూవీ కోసం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ స్పెషల్ ట్రాక్ ను హైదరాబాదులోని prism క్లబ్ లో సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేయనున్నారు.
కాగా, రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబరు 30న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈక ఈ చిత్ర దర్శకుడు విషయాన్నికొస్తే.. ఆయన వైవిధ్య కథలకు కేరాఫ్గా నిలిచే దర్శకుల్లో ఒకరు. స్వామిరారాతో మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత దోచేయ్, కేశవ, రణరంగం సినిమాలతో ఆకట్టుకున్నారు.
ఐక రవితేజ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ చిన్న టీజర్ను విడుదల చేసింది టీమ్. ఆ టీజర్ మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది.
ఇందులో మర్డర్స్ చేసినట్టు, అమ్మాయిలని బలవంతం పెట్టినట్టు కొన్ని షాట్స్ చూపించారు. ఆ తర్వాత ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో పాటు లాయర్ గా మరో పాత్ర కూడా పోషిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
అయితే తాజాగా మరో కొత్త విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఏంటంటే ఈ సినిమాలో ఉక్రెయిన్ బేస్డ్ శాంతి పీపుల్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్ ఓ స్పెషల్ పాట పాడింది. వేద మంత్రాలతో ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఉండేలాగా ఈ పాటను రూపొందించడం విశేషం. మరో విశేషమేమిటంటే.. శాంతి పీపుల్ బ్యాండ్ టాలీవుడ్ మూవీ కోసం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ స్పెషల్ ట్రాక్ ను హైదరాబాదులోని prism క్లబ్ లో సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేయనున్నారు.
కాగా, రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబరు 30న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈక ఈ చిత్ర దర్శకుడు విషయాన్నికొస్తే.. ఆయన వైవిధ్య కథలకు కేరాఫ్గా నిలిచే దర్శకుల్లో ఒకరు. స్వామిరారాతో మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత దోచేయ్, కేశవ, రణరంగం సినిమాలతో ఆకట్టుకున్నారు.