Begin typing your search above and press return to search.

'దేవదాస్‌' కాంబో రిపీట్‌ అవ్వబోతుంది

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:00 PM GMT
దేవదాస్‌ కాంబో రిపీట్‌ అవ్వబోతుంది
X
నాని హీరోగా రూపొందుతున్న 'టక్‌ జగదీష్‌' మూవీ కరోనా కారణంగా ఆరు నెలలుగా నిలిచి పోయింది. వచ్చే నెల నుండి షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. టక్‌ జగదీష్‌ మూవీ పూర్తి అయిన వెంటనే 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో ఈ సినిమా కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతోంది. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రకు గాను సాయి పల్లవి ఎంపిక అయ్యింది. ఆమె నెగటివ్‌ షేడ్స్‌ తో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సాయి పల్లవి కాకుండా మరో హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో కనిపించబోతుంది. పలువురు హీరోయిన్స్‌ పేర్లు ప్రచారం జరిగిన తర్వాత చివరకు ఈ సినిమా కోసం రష్మిక మందన్నాను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది భీష్మ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సక్సెస్‌ లు అందుకుంది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్‌ తో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమాతో పాటు తాజాగా నానికి జోడీగా సినిమాలో ఎంపిక అయినట్లుగా మీడియా సర్కిల్స్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. నాని.. రష్మిక మందన్నా ఇప్పటికే 'దేవదాస్‌' సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా నిరాశ పర్చినా మళ్లీ ఒకసారి నాని ఆమెతో జత కట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆమెకు ఉన్న లక్‌ తో నానితో ఈసారి అయినా సక్సెస్‌ దక్కించుకుంటుందా అనేది చూడాలి.