Begin typing your search above and press return to search.

కరోనా నా బిగ్ డ్రీమ్ పాడుచేసింది: స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 May 2020 4:00 PM GMT
కరోనా నా బిగ్ డ్రీమ్ పాడుచేసింది: స్టార్ హీరోయిన్
X
ఛలో చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన హీరోయిన్ రష్మిక మందన. మొదటి సినిమాతోనే యూత్ అందరిని ఫిదా చేసింది. రష్మిక చిలిపితనం, క్యూట్ క్యూట్ నటన కుర్రకారుకి విపరీతంగా నచ్చేసింది. ఆ క్యూట్ నెస్ తోనే.. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మా లాంటి వరుస విజయాలు దక్కడంతో టాలీవుడ్ లో అమ్మడికి భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలతో భారీ విజయాలను అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది. ఏ ఇండస్ట్రీలో అయినా కెరీర్ లో ఎదుగుతున్న రష్మిక క్రేజ్ మాములుగా లేదు.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక డ్రీమ్‌కు బ్రేకులు పడ్డట్లే ఉందట. ఎందుకంటే ఈ కన్నడ బ్యూటీ.. ఫ్యూచర్ సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కల ఈ ఏడాది తీర్చేసుకోవాలని అనుకుందట. అందుకు తగ్గట్టే సరిలేరు నీకెవ్వరు, భీష్మా విజయాలతో పరిస్థితులు కలిసొచ్చాయట. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక టార్గెట్‌పై నీళ్లు చల్లేసింది. ఇక రష్మిక డ్రీమ్ ఏంటంటే.. రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని.. రీసెంట్ హిట్ల తర్వాత జోష్ లో ఉన్న రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది. అందులో ఒకటి అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప.. కాగా మరొకటి కార్తీ సరసన తమిళంలో మరో సినిమా. అమ్మడికి లాక్ డౌన్ లో ఉన్న రష్మిక ఇంట్లో ఉండి ఏం చేయట్లేదట.. కానీ షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నాను అంటుందట ఈ బ్యూటీ. ఎందుకంటే తెలుసు కదా.. ఈ క్యూట్ బ్యూటీ డ్రీమ్ 2 కరోడ్స్ అని టాక్.