Begin typing your search above and press return to search.

అక్క‌డ తంతే ఇక్క‌డ బూరెల బుట్ట‌లో ప‌డ్డారు!

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:30 AM GMT
అక్క‌డ తంతే ఇక్క‌డ బూరెల బుట్ట‌లో ప‌డ్డారు!
X
-చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోయే ఘటనలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో శతాబ్దాల పాటూ చెప్పుకునే అరుదైన ఘటన నేడు ఆవిష్కృతం కాబోతుంది. అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి నేడు భూమి పూజ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. అలాగే రోజువారీ వస్త్రధారణ కు కాస్తా భిన్నంగా ప్రధాని మోదీ పంచకట్టులో అయోధ్య కి బయల్దేరారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌ లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. ముందుగా హనుమాన్‌ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.

-ఇకపోతే ఆలయ నిర్మాణ భూమిపూజ ముహూర్త సమయం కేవలం 32 సెకండ్లు మాత్రమే ఉందని తెలుస్తోంది. 32 సెకండ్లలోనే మోదీ భూమిపూజ పూర్తి చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ముహూర్తం ప్రారంభమై, 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లకు పూర్తవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు హాజరుకానున్నారు. వారిలో 135 మంది వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారు. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... 40 కేజీల వెండి ఇటుకను... పునాదిరాయిగా వెయ్యబోతున్నారు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు.ఇరుగు పొరుగు నుంచి టాలీవుడ్ ‌కు త‌ర‌లి వ‌చ్చే అందాల క‌థానాయిక‌ల జాబితా అంత‌కంత‌కు పెరుగుతోంది. మ‌ల‌యాళం క‌న్నడ ప‌రిశ్ర‌మ‌ల నుంచి భామ‌లు ఇటువైపు వ‌చ్చి క‌ర్ఛీఫ్ వేసేస్తుంటే తెలుగ‌మ్మాయిల‌కు గిరాకీ లేకుండా పోతోంది. బెంగ‌ళూరు మంగుళూరు కోడంబాక్కం భామ‌ల‌కే ఎందుకంత అలుసైపోతున్నాం! అన్న‌ది తెలుగ‌మ్మాయిల ఆవేద‌న‌.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ర‌ష్మిక మంద‌న ఈ కేట‌గిరీకి చెందిన భామ‌లే. వీళ్లంతా టాలీవుడ్ లో హ‌వా సాగించిన వారే. అయితే వీళ్లంతా టాలీవుడ్ నే ఎందుకు టార్గెట్ చేశారు? అంటే ఎవ‌రి కార‌ణాలు వాళ్ల‌కు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ‌మ్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చెప్పిన కార‌ణం షాక్ కి గురి చేసింది.

అనుపమ పరమేశ్వరన్ 2015 మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ప్రేమమ్` రీమేక్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత కేవ‌లం ఐదేళ్ల‌లో 12 సినిమాలు చేసింది. అప్ప‌టికి అనుపమ ఒకే ఒక్క‌ మలయాళ చిత్రం చేసింది. ఈ సినిమా టైటిల్ `జోమోంటే సువిషేశంగల్`. మాతృభాష‌ను లైట్ తీస్కుని ఎక్కువగా తెలుగు- తమిళ- కన్నడ ప‌రిశ్ర‌మ‌ల‌పైనే తన దృష్టి పెట్టింది. అయితే ఈ భామ ఇలానే ఎందుకు చేసింది? అన్న‌దానికి తాజా ఇంట‌ర్వ్యూలో ఆన్స‌ర్ దొరికింది.

``ప్రేమం విడుదల స‌మ‌యంలో నేను చాలా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ మూవీ రిలీజ్ త‌ర్వాత నా రోల్ చాలా ప‌రిమిత స‌మ‌య‌మే తెర‌పై క‌నిపించింద‌ని ప్రేక్ష‌కులు విమ‌ర్శించారు. నా వ్యక్తిగత వృద్ధికి పబ్లిసిటీని ఉపయోగించారంటూ నన్ను విప‌రీతంగా ట్రోల్ చేశారు. అందుకే నేను మాలీవుడ్ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను`` అని అస‌లు ర‌హ‌స్యం చెప్పింది అనుప‌మ‌. ఈ క్యూట్ బ్యూటీకి తెలుగు మీడియా నుంచి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి అలాంటిదేమీ ఎదురు కాలేదు. ఇక్క‌డ బాగా ఆద‌రించారు. క్యూట్ అనుప‌మ అంటూ ఆకాశానికెత్తేసి వ‌రుస అవ‌కాశాలిచ్చారు. ఒక ర‌కంగా తెలుగు యువ‌త అనుప‌మ మాయ‌లో ప‌డిపోయారు సిత్రంగా. ప్ర‌స్తుతం అనుప‌మ తెలుగులో రెండు సినిమాలు చేస్తుండ‌గా.. తమిళం- మలయాళంలో ఒక్కొక్కటి చేస్తోంది.

అలాగే క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌నకు మాతృప‌రిశ్ర‌మ‌లో విప‌రీత‌మైన‌ ట్రోల్స్ ఎదుర‌య్యాయి. అయితే అదంతా వేరే క‌థ‌. క‌న్న‌డ యువ‌హీరో ర‌క్షిత్ త‌న‌ని క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేశాడు. అత‌డితో సినిమా చేసి ఆ క్ర‌మంలోనే ప్రేమ‌లో ప‌డి నిశ్చితార్థం అయ్యాక అత‌డిని ర‌ష్మిక వ‌దిలించుకుంద‌ని క‌న్న‌డ అభిమానులు ద్వేషిస్తూ ట్రోల్ చేశారు. అందుకే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు షిఫ్ట‌యిపోయింది. ఇప్పుడు త‌మిళంలోనూ ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తోంది.