Begin typing your search above and press return to search.
ఆ రెండు చూడాలని ఉంది : రష్మిక
By: Tupaki Desk | 24 Feb 2020 5:45 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక టైం నడుస్తోంది. మొన్న సంక్రాంతికి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ ను దక్కించుకుంది. ఇక ఇటీవల నితిన్ తో కలిసి ‘భీష్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు లో పలు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. హైదరాబాద్ లో ఇంత బిజీగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్వరలో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఇంకా ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.
భీష్మ చిత్రం సక్సెస్ జోష్ లో ఉన్న ఈ అమ్మడు ఒక మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హైదరాబాద్ పై ప్రశంసల వర్షం కురిపించింది. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంది. ఇక్కడకు వచ్చిన కొత్తలో బిర్యానీ ఎక్కువగా తినేదాన్ని. ఇప్పటికి కూడా బిర్యానీ అంటే ఇష్టమే. కాని నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్న కారణంగా బిర్యానీ తినలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక హైదరాబాద్ లోని కొన్ని రోడ్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. అమెరికాలో ఉన్నామా అన్నట్లుగా అక్కడ ఉంటుంది అంది.
ఇక హైదరాబాద్ లో నాకు చార్మినార్ ఇంకా గోల్కొండ చూడాలని ఉంది. హైదరాబాద్ కు వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా వాటిని చూడ్డానికి మాత్రం కుదరడం లేదు. త్వరలోనే బుర్ఖా వేసుకుని చార్మినార్ చూసేందుకు వెళ్లాలని ఉంది. అలాగే గోల్కొండకు కూడా ఒకసారి వెళ్లి వస్తానంటూ చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా వాటిని చూడాలని ఉన్నా కూడా చూడలేక పోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
భీష్మ చిత్రం సక్సెస్ జోష్ లో ఉన్న ఈ అమ్మడు ఒక మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హైదరాబాద్ పై ప్రశంసల వర్షం కురిపించింది. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంది. ఇక్కడకు వచ్చిన కొత్తలో బిర్యానీ ఎక్కువగా తినేదాన్ని. ఇప్పటికి కూడా బిర్యానీ అంటే ఇష్టమే. కాని నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్న కారణంగా బిర్యానీ తినలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక హైదరాబాద్ లోని కొన్ని రోడ్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. అమెరికాలో ఉన్నామా అన్నట్లుగా అక్కడ ఉంటుంది అంది.
ఇక హైదరాబాద్ లో నాకు చార్మినార్ ఇంకా గోల్కొండ చూడాలని ఉంది. హైదరాబాద్ కు వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా వాటిని చూడ్డానికి మాత్రం కుదరడం లేదు. త్వరలోనే బుర్ఖా వేసుకుని చార్మినార్ చూసేందుకు వెళ్లాలని ఉంది. అలాగే గోల్కొండకు కూడా ఒకసారి వెళ్లి వస్తానంటూ చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా వాటిని చూడాలని ఉన్నా కూడా చూడలేక పోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.