Begin typing your search above and press return to search.

మరోసారి బాలయ్య-రానా సై అంటారా..?

By:  Tupaki Desk   |   2 April 2020 6:00 PM GMT
మరోసారి బాలయ్య-రానా సై అంటారా..?
X
గతేడాది మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా "అయ్యప్పనుమ్ కోషియం". ఈ సినిమాలో బిజూ మీనన్ - పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక హవాల్దారుకి - ఒక పోలీస్ ఆఫీసర్ ల మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో రూపొందించడానికి నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం బిజూ మీనన్ పాత్రకోసం నటసింహం బాలకృష్ణను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా పృథ్వీరాజ్ పాత్రకోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ పాత్రకోసం రానా కూడా సుముఖత చూపుతున్నట్లు వినికిడి. అయితే రానా - బాలకృష్ణ ఇంతకుముందు కథానాయకుడు - మహానాయకుడు సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. కాగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. రానా కూడా చేతినిండా సినిమాలతో బిజీ. మరి ఈ సినిమా పై వారిద్దరి నిర్ణయాలు తెలియాల్సి ఉంది. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రానప్పటికీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైతే విషయాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారట.