Begin typing your search above and press return to search.

ట్రంప్ పర్యటనపై వర్మ సెటైర్లు.. బాగా పేలాయి

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:25 AM GMT
ట్రంప్ పర్యటనపై వర్మ సెటైర్లు.. బాగా పేలాయి
X
భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కనీవినీ ఎరుగని స్థాయిలో మోడీ సర్కారు ఏర్పాట్లు చేయడంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వాగ్భాణాలు సంధించారు. ట్రంప్ పర్యటన కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేయడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వివాదాలకు ఆజ్యం పోస్తూ రాంగోపాల్ వర్మ కూడా ట్రంప్ పర్యటనపై సెటైర్లు వేశారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ టూరుపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ ను మనం ఇండియాకు ఆహ్వానించడానికి వేల కోట్లు ఖర్చు చేశాం.. కానీ ప్రధాని మోడీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా? ’ అని వర్మ ఘాటుగా ప్రశ్నించారు. అది అమెరికా.. భారత్ కాదు అంటూ వర్మ ఎద్దేవా చేశారు.

ఇక మరో ట్వీట్ లో ట్రంప్ ఇండియాకు రావడానికి గల కారణాన్ని వర్మ తనదైన శైలిలో చెప్పి ఎద్దేవా చేశారు. ట్రంప్ తను వస్తే ఎంత మంది వస్తాడో చూద్దామని వచ్చాడని.. ట్రంప్ చనిపోయే వరకు దీన్ని గొప్పగా చెప్పుకుంటాడని వర్మ ట్వీట్ లో దెప్పి పొడిచాడు.

ఇక బాలీవుడ్ నైట్ ను ట్రంప్ కోసం ఏర్పాటు చేయడంపై ట్రంప్ సెటైర్లు వేశారు. మన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయులే చూడరని ట్రంప్ ఎలా చూస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఇలా వర్మ పంచులతో మోడీని, ట్రంప్ పర్యటనను ఏకిపారేశాడు.