Begin typing your search above and press return to search.

చరణ్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా లేనట్టే...!

By:  Tupaki Desk   |   1 May 2020 5:45 AM GMT
చరణ్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా లేనట్టే...!
X
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన హోమ్ ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే అందరు హీరోలు వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ ఏ చిత్రం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చ‌ర‌ణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోతున్నాడనే న్యూస్ బయటకి వచ్చింది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారని రూమర్ వచ్చింది. దీని మీద రోజుకో వార్త షికారు చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పుకార్ల మీద క్లారిటీ వచ్చింది. ట్రిపుల్ ఆర్ తరువాత రామ్ చరణ్ - అనిల్ రావిపూడి సినిమా లేదట. ఈ విషయాన్ని తుపాకీ డాట్ కామ్ ఆల్రెడీ చెప్పింది కూడా.

అయితే చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మహేష్ బాబు నిర్మాతగా మారుతున్నాడట. మహేష్ తన సొంత బ్యానర్ లో చెర్రీ హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. మహేష్‌ బాబు - రామ్ చరణ్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ స్నేహం కారణంగానే చరణ్‌ తో మహేష్‌ బాబు మూవీని నిర్మించబోతున్నాడని వార్తలు టాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. వంశీ పైడిపల్లితో మరో సినిమాలో నటించేందుకు మహేష్ ఆ మధ్యన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌ కు బ్రేక్ పడింది. ఈ స్ర్కిఫ్ట్‌కి హీరోగా తానూ సరిపోనని.. అందుకే ఈ కథను మహేష్ పక్కన పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ కి సూట్ అవుతాడని.. కావాలంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్దం అని మహేష్ హామీ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ నడుస్తోంది. మహేష్ తో ఎక్కాల్సిన స్టోరీని చెర్రీతో చేయడానికి వంశీ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి చరణ్ కి ఆ కథ వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. అన్నీ కుదిరితే చరణ్ హీరోగా మహేష్ నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి - రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో 'ఎవడు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.