Begin typing your search above and press return to search.
ఆచార్య తర్వాత రీమేక్ లోనూ చిరుచరణ్
By: Tupaki Desk | 20 Sep 2020 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి.. చరణ్ లు స్ర్కిన్ పై కలిసి నటిస్తే చూడాలని చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరకుంటున్నారు. ఇప్పటికే మగధీర మరియు బ్రూస్ లీ సినిమాల్లో అలా తళుక్కున మెరిసిన ఈ మెగా తండ్రి కొడుకులు ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరు.. చరణ్ ల కాంబో సీన్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని త్వరలోనే వీరిద్దరు కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మలయాళ హిట్ మూవీ 'లూసీఫర్' ను చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటున్నాడు. సుజీత్ దర్శకత్వంలో మొదట ఆ రీమేక్ ను చేయానలుకున్నా స్ర్కిప్ట్ వర్క్ విషయంలో నిరాశ కలగడంతో రీమేక్ బాధ్యతలను ఇప్పుడు వినాయక్ కు అప్పగించారట. ప్రస్తుతం ఆయన రీమేక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. ఆచార్య తర్వాత వేదాళం సినిమా రీమేక్ ఉంటుంది. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ ఉంటుందట. లూసీఫర్ రీమేక్ లో కీలక పాత్రను రామ్ చరణ్ పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది.
వివి వినాయక్ చాలా పట్టుదలగా చరణ్ ను నటింపజేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా చేయబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కనుక ఈ లోపు ఆచార్య మరియు లూసీఫర్ లో నాన్నతో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు.
మలయాళ హిట్ మూవీ 'లూసీఫర్' ను చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటున్నాడు. సుజీత్ దర్శకత్వంలో మొదట ఆ రీమేక్ ను చేయానలుకున్నా స్ర్కిప్ట్ వర్క్ విషయంలో నిరాశ కలగడంతో రీమేక్ బాధ్యతలను ఇప్పుడు వినాయక్ కు అప్పగించారట. ప్రస్తుతం ఆయన రీమేక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. ఆచార్య తర్వాత వేదాళం సినిమా రీమేక్ ఉంటుంది. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ ఉంటుందట. లూసీఫర్ రీమేక్ లో కీలక పాత్రను రామ్ చరణ్ పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది.
వివి వినాయక్ చాలా పట్టుదలగా చరణ్ ను నటింపజేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా చేయబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కనుక ఈ లోపు ఆచార్య మరియు లూసీఫర్ లో నాన్నతో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు.