Begin typing your search above and press return to search.
షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
By: Tupaki Desk | 19 Sep 2020 6:45 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వికారాబాద్ అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. దాదాపు పది రోజుల పాటు రకుల్ ఆ షూటింగ్ లో పాల్గొందట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో తన షూటింగ్ పార్ట్ ను ముగించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. తాజాగా ఆమె హైదరాబాద్ రోడ్డు మీద కనిపించింది.
క్రిష్ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఆమె ఉండేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఎందుకంటే రకుల్ కు హైదరాబాద్ లోనే ఎక్కువ కంఫర్ట్ ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ తన రెండవ ఇల్లును ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రకుల్ ఇక్కడే ఉండి పోయింది. ప్రస్తుతం ఈమె ఒక వెబ్ సిరీస్ కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
క్రిష్ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఆమె ఉండేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఎందుకంటే రకుల్ కు హైదరాబాద్ లోనే ఎక్కువ కంఫర్ట్ ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ తన రెండవ ఇల్లును ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రకుల్ ఇక్కడే ఉండి పోయింది. ప్రస్తుతం ఈమె ఒక వెబ్ సిరీస్ కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.