Begin typing your search above and press return to search.
మ్యాన్ వర్సెస్ వైల్డ్: కర్ణాటక అడవుల్లో రజనీకాంత్కు గాయాలు
By: Tupaki Desk | 28 Jan 2020 3:54 PM GMTసౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంగళవారం గాయాలయ్యాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ సందర్భంగా ఆయన భుజానికి స్వల్ప గాయమైంది. డిస్కవరీ ఛానల్కు చెందిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం కర్ణాటకలోని బందిపుర అడవుల్లో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాం కోసం ఉత్తరాఖండ్ను ఎంచుకున్న డిస్కవరీ ఛానల్ ఈసారి దక్షిణ భారత్ను ఎంచుకుంది. ఇందులో భాగంగా బందీపూర్ అడవుల్లో రజనీకాంత్ తో ఈ షూటింగ్ సాహస యాత్రను ప్రారంభించింది.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం బందీపుర చేరుకున్న రజనీకాంత్ మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తారు. ఈ అడవిలో పులుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం కోసం బందీపుర అడవుల్లోని నాలుగు ప్రాంతాల్లో షూటింగ్కు అనుమతి ఇచ్చింది.
ప్రకృతి పరిరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ కోసం రజనీకాంత్తో మాట్లాడుతారు. రజనీకాంత్ సహజంగానే కొండలు - కోనలు - గుట్టల్లో ప్రయాణాలు అంటే ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్తారు. ఇప్పుడు మూడ్రోజుల పాటు బందీపుర అడవుల్లో గడుపుతున్నారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాం కోసం ఉత్తరాఖండ్ను ఎంచుకున్న డిస్కవరీ ఛానల్ ఈసారి దక్షిణ భారత్ను ఎంచుకుంది. ఇందులో భాగంగా బందీపూర్ అడవుల్లో రజనీకాంత్ తో ఈ షూటింగ్ సాహస యాత్రను ప్రారంభించింది.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం బందీపుర చేరుకున్న రజనీకాంత్ మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తారు. ఈ అడవిలో పులుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం కోసం బందీపుర అడవుల్లోని నాలుగు ప్రాంతాల్లో షూటింగ్కు అనుమతి ఇచ్చింది.
ప్రకృతి పరిరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ కోసం రజనీకాంత్తో మాట్లాడుతారు. రజనీకాంత్ సహజంగానే కొండలు - కోనలు - గుట్టల్లో ప్రయాణాలు అంటే ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్తారు. ఇప్పుడు మూడ్రోజుల పాటు బందీపుర అడవుల్లో గడుపుతున్నారు.