Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న ద‌ర్శ‌క‌ధీర‌

By:  Tupaki Desk   |   15 Sep 2019 4:41 AM GMT
ఫ్యాన్స్ దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న ద‌ర్శ‌క‌ధీర‌
X
ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఇద్ద‌రికి సినిమాలో స‌మాన ప్రాధాన్య‌త ఇవ్వాలి. అలా జ‌ర‌గ‌లేదో ఫ్యాన్స్ నుంచి పెద్ద‌ స్థాయిలో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోక త‌ప్ప‌దు. ఇప్పుడు అలాంటి త‌ల‌నొప్పులే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఎదుర్కొంటున్నారు.

త‌ను ఏ సినిమా చేసినా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్ర‌మోష‌న్ ని విభిన్నంగా ప్లాన్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో ఆ ప్రాజెక్ట్ ప‌ట్ల ఆమితాస‌క్తిని.. ఎక్స్ పెక్టేష‌న్స్ ని పెంచేయ‌డం ఆయ‌న ప‌ద్ధ‌తి. `మ‌ర్యాద రామ‌న్న‌` నుంచి రాజ‌మౌళి ఇదే స్ట్రాట‌జీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తి క్లిక్క‌య్యింది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఆయ‌న‌ సొంతం చేసుకుంటున్నారు. బాహుబ‌లి ఫ్రాంఛైజీకి ఇది ఇండియా లెవ‌ల్లో వ‌ర్క‌వుటైంది.

అయితే ఇప్పుడా స్ట్రాట‌జీని ఫాలో కావాలంటే రాజమౌళికి భ‌య‌మేస్తోంద‌ట‌. కార‌ణం రామ్ చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్ ల అభిమానులే. ఈ క్రేజీ స్టార్ల‌తో జ‌క్క‌న్న `ఆర్ ఆర్ ఆర్‌` లాంటి భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసిన‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయాలంటే జ‌క్క‌న్న భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఎక్క‌డ అభిమానులు మా హీరోని త‌క్కువ చేసి చూపించావంటే మా హీరోని త‌క్కువ చేసి చూపించావ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర‌ణ్ - తార‌క్ ఫ్యాన్స్ ఎక్క‌డ కొట్టుకుంటారో నని.. అది సినిమాను ఎక్క‌డ కిల్ చేస్తుందోనని జ‌క్క‌న్న భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఇప్ప‌టికే `ఆర్ ఆర్ ఆర్‌` ఫ‌స్ట్ లుక్‌ ని విడుద‌ల చేయాల‌నుకున్నా అభిమానుల ఫిక‌ర్ కార‌ణంగా జంకుతున్నార‌ట జ‌క్క‌న్న‌. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ చిత్రం రిలీజ్ కానుంది.